Actor Kasthuri Shankar: ఈ ఆదివారం నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. వారిద్దరూ కవలలకు జన్మనిచ్చి తల్లిదండ్రులు అయ్యినట్టు ప్రకటించారు. నయన్ అండ్ శివన్ ఈ ఏడాది జూన్ 9న మహాబలిపురంలోని ఒక ప్రసిద్ధ రిసార్ట్లో కుటుంబ సమేతంగా వివాహం చేసుకున్న సంగతి మనకి తెలిసిందే.
Nayanthara Vignesh Shivan : కవలలకు తల్లి అయిన నయనతార.. ముందే చెప్పిన ఎన్టీఆర్..! మ్యాటర్ ఏంటంటే..
అయితే ఈ జంట అద్దె గర్భం ద్వారా కవలలకు తల్లిదండ్రులు అయినట్లు ప్రకటించగా, కొంతమంది వీరికి శుభాకాంక్షలు తెలుపుతుంటే, మరికొంతమంది వీరిద్దరూ చేసిన పనిని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నటి కస్తూరి.. పరోక్షంగా నయన్ దంపతులను విమర్శించేలా కామెంట్ చేశారు.
“భారతదేశంలో సరోగసీ నిషేధించబడింది. వైద్యపరంగా అనివార్య కారణాల కోసం తప్ప, అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అవ్వడం చట్టరీత్యా నేరం. ఇది జనవరి 2022 నుండి వచ్చిన చట్టం. దీని గురించి మనం చాలా రోజులుగా వింటూనే ఉన్నాం” అంటూ ట్వీట్ చేశారు. ప్రముఖ ఛానల్ లో ప్రసారమవుతున్న గృహలక్ష్మి సీరియల్ తో ఈమె తెలుగువారికీ చాలా దగ్గరయ్యారు.