హీరో రాజ్ తరుణ్ ట్రయాంగిల్ లవ్‌స్టోరీలో మరో ట్విస్ట్.. వారిద్దరి మెసేజ్ చాట్స్ లీక్

వీడియో కాల్స్ ద్వారా రెగ్యులర్ రాజ్ తరుణ్, మాల్వి మాట్లాడుకునేవారు. రోజువారి ప్లానింగ్స్, ట్రిప్స్, తదితర విషయాలపై ప్రతిదీ ఇద్దరు షేర్ చేసుకున్నారు.

Raj Tarun-Lavanya Case

Actor Raj Tarun-Lavanya Case : హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రాల మధ్య కేసుల వ్యవహారం తారాస్థాయికి చేరింది. తాజాగా రాజ్ తరుణ్, మల్హోత్రా మెసేజ్ చాటింగ్ లీక్ అయింది. 2023లో మాల్వి మల్హోత్రాకు రాజ్ తరుణ్ లవ్ ప్రపోజ్ చేశాడు. రాజ్ తరుణ్ నుండి వచ్చిన ప్రపోజల్ కు మాల్వి మల్హోత్రా వెంటనే యాక్సెప్ట్ అంటూ మెసేజ్ పెట్టింది. అనేక సార్లు రాజ్ తరుణ్ కు మాల్వి హోటల్స్ బుక్ చేసింది. ప్రతీసారి కోయంబత్తూర్ మాధవ హోటల్ లో రాజ్ తరుణ్, మాల్వి కలిసినట్లు తెలుస్తోంది.

Also Read : Raj Tarun : రాజ్ తరుణ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు.. 10టీవీతో లావ‌ణ్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

వీడియో కాల్స్ ద్వారా రెగ్యులర్ గా రాజ్ తరుణ్, మాల్వి మాట్లాడుకునేవారు. రోజువారి ప్లానింగ్స్, ట్రిప్స్, తదితర విషయాలపై ప్రతిదీ ఇద్దరు షేర్ చేసుకున్నారు. మాల్వి మల్హోత్రా పర్సనల్ విషయాలపైనా రాజ్ తరుణ్ చాటింగ్ లో ప్రస్తావించేవాడని తెలిసింది. ప్రస్తుతం వీరి మధ్య జరిగిన చాటింగ్ వ్యవహారం లీక్ కావడంతో లావణ్య చేసిన ఆరోపణలు నిజమవుతున్నట్లుగా ఉంది. మాల్వి, రాజ్ తరుణ్ తో ఇల్లీగల్ రిలేషన్ అంటూ లావణ్య కొద్దిరోజుల క్రితం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : భారీ వర్షాలకు సముద్రంలో అల్లకల్లోలం.. స్కూల్స్‌కు సెలవు ప్రకటించిన కలెక్టర్

లావణ్య పెట్టిన కేసులో రాజ్ తరుణ్ కి నార్సింగ్ పోలీసులు నోటీసులు కూడా పంపారు. ఈనెల 18వ తేదీలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అంటే గురువారం రోజుతో గడువు ముగిసింది. కానీ రాజ్ తరుణ్ విచారణకు హాజరు కాలేదు. తన లాయర్ ని పంపాడు. తన చిత్రాల షూటింగ్స్, బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నానని రాజ్ తరుణ్ పోలీసులకు లేఖ రాసి తన లాయర్ తో పంపించారు. విచారణకు హాజరయ్యేందుకు మరికొన్ని రోజుల గడువు కావాలని లేఖలో పోలీసులను కోరినట్లు తెలిసింది.

 

ట్రెండింగ్ వార్తలు