Raj Tarun : రాజ్ తరుణ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు.. 10టీవీతో లావ‌ణ్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ గ‌త కొన్ని రోజులుగా వార్త‌ల్లో నిలుస్తున్న విష‌యం తెలిసిందే.

Raj Tarun : రాజ్ తరుణ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు.. 10టీవీతో లావ‌ణ్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Lavanya on Raj Tarun : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ గ‌త కొన్ని రోజులుగా వార్త‌ల్లో నిలుస్తున్న విష‌యం తెలిసిందే. త‌న‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి మోసం చేశాడ‌ని, అబార్ష‌న్ చేయించాడ‌ని, ఇప్పుడు వేరే హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవ‌డానికి రెడీ అయ్యాడ‌ని లావ‌ణ్య అనే యువ‌తి రాజ్‌త‌రుణ్ పై కేసు పెట్టింది. తాజాగా లావ‌ణ్య 10టీవీతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. రూ.5ల‌క్ష‌లు ఇస్తామ‌ని, కేసు వాప‌స్ తీసుకోవాల‌ని త‌న‌కు బెదిరింపులు వ‌స్తున్నాయని.. రాజ్ త‌రుణ్ ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్నాడ‌ని పోలీసులు చెప్పారని తెలిపారు.

‘రాజ్ తరుణ్‌పై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని నన్ను బెదిరిస్తున్నారు. రూ.5 లక్షలు ఇస్తామని కేసు వాపస్ చేసుకోవాలని మెసేజ్ లు పెడుతున్నారు. రాజ్ తరుణ్‌పై కేసు నమోదు కావ‌డంతో అత‌డు త‌న‌ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అత‌డు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నార’ని లావ‌ణ్య వెల్లడించారు.

‘నన్ను పెళ్లి చేసుకొని నాతో పదేళ్లపాటు ఉన్న రాజ్ తరుణ్ ఇప్పుడు వేరే వారితో ఉండడంతో వాళ్లపై ఫిర్యాదు చేశాను. 2014లో రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. రాజ్ తరుణ్ ని మా కుటుంబం అన్ని విధాలుగా ఆదుకుంది. రాజ్ తరుణ్‌కు ఉన్న ఆర్థిక సమస్యలు మొత్తాన్ని మా కుటుంబం భరించింది. రాజ్ తరుణ్‌కి ఇప్పటివరకు 70 లక్షల రూపాయలు ఇచ్చాము. రాజ్ తరుణ్ పెంచుకునే కుక్కల కారణంగా 6 సంవత్సరాల్లో 6 ఇళ్లు మారాల్సి వచ్చింది.

2016లో నేను గర్భవతి అయ్యాను. రెండవ నెలలో నాకు అబార్షన్ చేయించాడు. నా హాస్పిటల్ బిల్స్ అన్ని రాజ్ తరుణ్ చెల్లించాడు. నాపై అక్రమ కేసులు బనాయించి నన్ను జైల్లో పెట్టారు. మాల్వి మల్హోత్రా అతని సోదరుడు మయాంక్‌ నన్ను చంపేస్తానని బెదిరించారు. నాకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తాను. ఎవరి బెదిరింపులకు నేను లొంగేదాన్ని కాను. నాకు డబ్బులు ఆశ చూపించి నన్ను కొనలేరు. నేను ఇప్పటికీ రాజ్ తరుణ్ తోనే జీవించాలని కోరుకుంటున్నాన’ని లావ‌ణ్య అన్నారు.

Also Read: రాజ్ తరుణ్ – లావణ్య కేసు.. దెబ్బకి సినిమా వాయిదా వేసుకున్న హీరో, హీరోయిన్..

లావణ్య తరపు న్యాయవాది మాట్లాడుతూ..
ఒక మహిళకు న్యాయం చేయాలని నేను ఈ కేసును వాదిస్తున్నాను అని లావ‌ణ్య త‌రుపు న్యాయ‌వాది కళ్యాణ్ దిలీప్ సుంకర తెలిపారు. ‘హీరో రాజ్ తరుణ్ నా క్లయింట్ లావణ్య ను ప్రేమించి పెళ్లి చేసుకొని అవసరం తీరాక వదిలేయడం కరెక్ట్ కాదు. నార్సింగ్ పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించాము. ఆధారాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు మూడు సెక్షన్స్ కింద రాజ్ తరుణ్ పై మరో ఇద్దరుపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 420, 493, 506 సెక్షన్ల కింద నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 493 పెళ్లి చేసుకుని మోసం చేయడం చట్ట విరుద్ధం దీనికి పదేళ్లపాటు జైలు శిక్ష ఉంది.

Also Read : వరుణ్ సందేశ్ ‘విరాజి’ టీజర్ చూశారా? బేబీ డైరెక్టర్ చేతుల మీదుగా రిలీజ్..

506 బెదిరింపులకు గురి చేయడం..మల్హోత్రా ఆమె సోదరుడు మాయాంక మలయాత్ర నా క్లైంట్ ని చంపేస్తామని బెదిరింపులకు గురి చేసారు. 420 సెక్షన్ మోసం చేయడం ప్రేమించి పెళ్లి చేసుకొని వేరే అమ్మాయి పరిచయం అయిన తర్వాత వదిలేయడం చట్ట విరుద్ధం. పోలీసులు రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను. రాజ్ తరుణ్ న్యాయస్థానాలను ఆశ్రయించిన అందుకు మేము కూడా న్యాయస్థానాల ముందు మా వాదనలు ఆధారాలతో సహా నిరూపిస్తాము. రాజ్ తరుణ్ కేసుతో మరొక మహిళకు ఇలాంటి అన్యాయం జరగకుండా చూస్తామ’ని చెప్పారు.