డిఫరెంట్ కంటెంట్తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న తెలుగు OTT ప్లాట్ ఫాం ఆహా ప్రేక్షకులను మరింతగా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతోంది. రీసెంట్గా ఆహాలో విడుదలైన భానుమతి అండ్ రామకృష్ణ, జోహార్ వంటి మూవీలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు రాజ్ తరుణ్ హీరోగా నటించిన రొమ్కామ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానుంది. విజయ్ కుమార్ కొండా ఈ మూవీకి దర్శకత్వం వహించారు. మాళవికా నాయర్, హెబ్బాపటేల్ హీరోయిన్స్గా నటించారు. కుమారి 21 ఎఫ్లో సూపర్బ్ కెమిస్ట్రీతో హిట్ పెయిర్గా నిలిచిన రాజ్తరుణ్, హెబ్బాపటేల్ మరోసారి ఈ చిత్రంలో సందడి చేయనున్నారు.
ఫన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అతి తక్కువ సమయంలోనే ఆహా ఓటీటీ ఎంటర్టైన్మెంట్ పరంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకుంది. అభిమాన అగ్ర నటులు నటించిన క్లాసికల్ లైబ్రరీ ఆహా తమ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది.
యంగ్ హీరో రాజ్తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్కురువిళ్ళ, సప్తగిరి, రాజారవీంద్ర, అజయ్ఘోష్, అన్నపూర్ణమ్మ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధు నందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ బాణీలు సమకూర్చారు.