ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా అప్డేట్ రానుంది..
‘అల వైకుంఠపురములో..’ నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేయడంతో ఫుల్ జోష్లో ఉన్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో హ్యాట్రిక్ ఫిల్మ్ చేయనున్నాడు. బన్నీ నటిస్తున్న 20వ సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. గతకొద్ది రోజులుగా ఈ సినిమా కోసం మేకోవర్ అవుతున్నాడు బన్నీ.
అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఉదయం 9 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను రివీల్ను చేయనున్నట్టు తెలిపారు.
Read Also : సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న షెర్లీన్ చోప్రా
‘ఏమబ్బా, అందరూ బాగుండారా.. మీరు ఎప్పుడెప్పుడా అని చూస్తాండే.. AA 20 అప్డేట్ ఏప్రిల్ 8న, తెల్లార్తో 9 గంటలకు వస్తాండాది.. రెడీ కాండబ్బా’ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఆ రోజున మూవీ టైటిల్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. బన్నీ ఈ సినిమాలో లారీ డ్రైవర్, స్టైలిష్ బిజినెస్మెన్గా ద్విపాత్రాభినయం చేయనున్నాడని సమాచారం. బన్నీకి జంటగా రష్మికా మందన్నా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.
#AA20Update on 8th April at 9 AM ?
Inka chusko naa saamii ??@alluarjun @aryasukku @ThisIsDSP #AA20 pic.twitter.com/ixqlaQhtoy— Mythri Movie Makers (@MythriOfficial) April 6, 2020