Allu Arjun : అల్లు అర్జున్ మంచి మ‌న‌సు.. వాళ్ళ కోసం రూ.10ల‌క్ష‌లు..

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌ను క‌లిశారు. ఈ కార్య‌క్ర‌మానికి రావాల్సిందిగా కోరారు.

మే 4న దాస‌రి నారాయ‌ణ రావు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ప్ర‌తి సంవ‌త్స‌రం డైరెక్ట‌ర్స్‌ డేని తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జ‌రుపుతారు. అయితే.. ఈ సారి ప‌లు కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. మే 19న ఎల్‌బీ స్టేడియంలో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కార్యవర్గం సినీ ప్ర‌ముఖుల‌ను స్వ‌యంగా క‌లిసి ఆహ్వానిస్తున్నారు.

తాజాగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌ను క‌లిశారు. ఈ కార్య‌క్ర‌మానికి రావాల్సిందిగా కోరారు. ఇందుకు బ‌న్నీ సానుకూలంగా స్పందించారు. కాగా.. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కి సొంత భవనం కట్టాలని, మెంబర్స్ అందరికి హెల్త్ కేర్ ఉండాలని చూస్తుంది. ఇందుకోసం నిధులు సమీక‌రిస్తోంది.

Gorre Puranam : మ‌రో కొత్త కాన్సెప్ట్‌తో సుహాస్‌.. ‘గొర్రెపురాణం’ టీజ‌ర్ అదిరిపోయిందిగా..

ఇప్పటికే పలువురు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కి డొనేషన్ ఇవ్వ‌గా.. అల్లు అర్జున్ సైతం రూ.10 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఆయనకు ధన్యవాదాలు తెలియ‌జేసింది. ఈ విష‌యం తెలిసిన నెటిజ‌న్లు అల్లుఅర్జున్ ది ఎంతో మంచి మ‌న‌సు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. పుష్ప కు సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని 2024 ఆగ‌స్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

Chiranjeevi : రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

ట్రెండింగ్ వార్తలు