లాక్డౌన్ లాస్ట్స్టేజ్కి వచ్చినా పెద్ద సినిమాలేవీ ఇప్పటి వరకూ సెట్స్ మీదకెళ్లలేదు. అందుకే ఇదే మంచి టైమ్ అనుకుని.. చిన్న సినిమాల హవా మొదలైపోయింది. మొన్నీ మధ్య వరకూ కథల మీద కసరత్తులు చేసిన పెద్ద డైరెక్టర్లు.. ఇప్పుడు తమ కథలను యంగ్ డైరెక్టర్లకు, చిన్న డైరెక్టర్లకు అప్పు ఇస్తున్నారు.
పెద్ద డైరెక్టర్ల సినిమాలేవీ ఇప్పుడు సెట్స్ మీదకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే చిన్న సినిమాలు స్పీడందుకున్నాయి. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఖాళీగా ఉండి కథలు రాసుకున్న పెద్ద డైరెక్టర్లు.. యంగ్ డైరెక్టర్లకు కథలు అరువుగా ఇస్తున్నారు. రీసెంట్గా సంపత్ నంది, మోహన్ భరద్వాజ్ డైరెక్ట్ చేస్తున్న ‘బ్లాక్ రోజ్’ అనే సినిమాకు కథ, స్క్రీన్ప్లే అందిస్తున్నారు. మిస్ ఇండియా ఊర్వశీ రౌతేల హీరోయిన్గా నటిస్తోంది. సంపత్ నంది ప్రస్తుతం గోపీచంద్, తమన్నాలతో ‘సీటీమార్’ అనే సినిమా చేస్తున్నాడు.