Bigg Boss 7 Day 98 : అనుకున్నట్టు ఈ వారం ఎలిమినేట్ అయింది వాళ్ళే.. ఫినాలేకి వెళ్ళింది ఎవరు?

ఫినాలేకి ఎవరెవరు వెళ్లారు, ఎవరు ఎలిమినేట్ అయింది చెప్పారు నాగార్జున.

Bigg Boss 7 Day 98 Highlights Eliminations and Finale List

Bigg Boss 7 Day 98 : బిగ్‌బాస్ 14వ వారం కూడా పూర్తయింది. శనివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ చేసిన తప్పులని చూపిస్తూ అందరిపై ఫైర్ అయిన నాగార్జున(Nagarjuna) ఆదివారం ఎపిసోడ్ లో కూల్ అయిపోయి ఎంటర్టైన్ చేశారు. ఆదివారం ఎపిసోడ్ లో మొదట ఏ వారంలో చేసిన తప్పుకి మీరు పశ్చాత్తాపం ఫీల్ అయ్యారు అని గేమ్ పెట్టారు నాగార్జున. వారాల నంబర్స్ పెట్టి ఒక వీల్ ఇచ్చారు. ఆ వీల్ ని తిప్పి వాళ్ళు ఏ వారంలో చేసిన దానికి పశ్చాత్తాపం ఫీల్ అవుతున్నారో కంటెస్టెంట్స్ చెప్పాలి.

ఇందులో ప్రియాంక 7వ వారంలో భోలేని తిట్టినా దాని గురించి ఫీల్ అయింది. శోభాశెట్టి 9వ వారంలో యావర్ ని తిట్టకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపం ఫీల్ అయింది. అమర్ 14వ వారం తాను అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సిందని అన్నాడు. శివాజీ కూడా 14వ వారంలో ఆడపిల్లల గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అన్నాడు. ఈ పశ్చాత్తాపం ఎపిసోడ్ అయ్యాక ఇన్ని రోజులు ఎవరికి ఎవరి దగ్గర ఏం నేర్చుకున్నారు అని అడిగారు. కంటెస్టెంట్స్ అంతా ఒక్కొక్కరి దగ్గర్నుంచి ఏమేమి నేర్చుకున్నారో చెప్పారు. శోభాశెట్టి మాత్రం ఎవరి దగ్గరా ఏమి నేర్చుకోలేదని, కాకపోతే ఇన్ని రోజులు ఫోన్ లేకుండా గడపడం నేర్చుకున్నాను అని తెలిపింది.

అనంతరం కంటెస్టెంట్స్ మీద సోషల్ మీడియాలో వచ్చిన మీమ్స్ చూపించి కాసేపు నవ్వించారు. సంగీత దర్శకుడు MM కీరవాణి ఈ వారం గెస్ట్ గా వచ్చి కాసేపు కంటెస్టెంట్స్ తో ముచ్చటించారు. ఆ తర్వాత ఫినాలేకి ఎవరెవరు వెళ్లారు, ఎవరు ఎలిమినేట్ అయింది చెప్పారు నాగార్జున. ఆల్రెడీ అర్జున్ ఫినాలేకి అర్హత సాధించగా ప్రియాంక కూడా ఫైనల్ కి వెళ్ళింది. ఆ తర్వాత అమర్ దీప్, ప్రశాంత్, యావర్, శివాజీలు కూడా ఫినాలేకి వెళ్లినట్టు చెప్పారు నాగ్. శోభాశెట్టి ఎలిమినేట్ అయిందని ప్రకటించాడు. దీంతో స్టేజి మీదకు వచ్చిన శోభా ఒక్కసారిగా ఏడ్చేసింది. వెళ్ళిపోతూ శివాజీ, యావర్ గురించి.. వాళ్ళు చేసిన పనులన్నీ చెప్పి, వాళ్ళ మీద ఫైర్ అయి వెళ్ళింది.

Also Read : Bigg Boss 7 Day 97 : కంటెస్టెంట్స్ పై ఫైర్ అయిన నాగార్జున.. ఒక్కొక్కరికి ఇచ్చి పడేశాడుగా..

అయితే అసలు ఎవరికీ తెలియని, గేమ్ కూడా అంత పవర్ ఫుల్ గా ఆడని అర్జున్, సింపతీ, శివాజీ సపోర్ట్ తప్ప ఇంకేమి చేయని ప్రశాంత్ లు ఫైనల్ కి వెళ్లడం, శోభాశెట్టి చివరి వరకు వచ్చి ఎలిమినేట్ అవ్వడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. కావాలనే ఇలా చేశారు అంటూ శోభా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఫైనల్ కి అయిదుగురు మాత్రమే ఉంటారు. కానీ ఈ సారి ఆరుగురిని ఫైనల్ కి ఉంచారు. మరి వీరిలో మధ్యలో ఎవర్ని ఎలిమినేట్ చేస్తారో, వీరిలో ఎవరు బిగ్‌బాస్ కప్పు కొడతారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు