Dhanush
Aishwaryaa : కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్-ఐశ్యర్య ఈ ఏడాది జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరు విడిపోవడాన్ని ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. 18 ఏళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడాకులు తీసుకుని అందరికి షాకిచ్చారు. ఇక విడిపోయాక ధనుష్-ఐశ్యర్యలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అనుకోకుండా రెండు సార్లు ఒకరికొకరు ఎదురుపడ్డా కనీసం పలకరించుకోలేదు. అయితే విడాకుల అనంతరం తొలిసారి మాజీ భార్యపై ట్వీట్ చేశాడు ధనుష్.
ఇటీవల ఐశ్యర్య దర్శకత్వంలో ఓ మ్యూజిక్ వీడియోని రూపొందించింది. ఈ మ్యూజిక్ వీడియోలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఢీ ఫేం శ్రష్టి జంటగా నటించారు. ఈ వీడియో తమిళ వెర్షన్ ‘పయని’ని తాజాగా సూపర్స్టార్ రజినీకాంత్ విడుదల చేయగా, తెలుగు వెర్షన్ ‘సంచారి’ని అల్లు అర్జున్, మలయాళ వర్షన్ ‘యాత్రక్కారి’ని మోహన్లాల్ రిలీజ్ చేశారు. ధనుష్ ఈ వీడియోని షేర్ చేస్తూ ట్వీట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.
RGV : ‘రాధేశ్యామ్’కి అంత బడ్జెట్ అవసరం లేదు.. ఆర్జీవీ కామెంట్స్..
ఈ వీడియో రిలీజ్ సందర్భంగా ఐశ్యర్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ధనుష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం కోలీవుడ్లో హాట్టాపిక్ గా మారింది. ఈ మ్యూజిక్ వీడియోను ధనుష్ షేర్ చేస్తూ.. ”పయని మ్యూజిక్ వీడియోకు దర్శకత్వం వహించిన నా స్నేహితురాలు ఐశ్యర్యకు శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్’’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే ట్వీట్ లో ఐశ్వర్యని ఫ్రెండ్ అంటూ సంభోదించడంతో నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.
Congrats my friend @ash_r_dhanush on your music video #payani https://t.co/G8HHRKPzfr God bless
— Dhanush (@dhanushkraja) March 17, 2022