Vishwanath and Sons OTT : ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మమితా బైజు జంటగా నటించిన చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Vishwanath and Sons OTT).
- Thota Vamshi Kumar
- Published on- August 14, 2026 / 09:36 AM IST
Do you know Suriya Vishwanath and Sons movie will come which OTT
Vishwanath and Sons OTT : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మమితా బైజు జంటగా నటించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. రాధికా శరత్కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సంయుక్తంగా నిర్మించారు.
జీవి ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ మూవీ నేడు (ఆగస్టు 14న) రిలీజైంది. తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి చోట ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది.
Vishwanath and Sons : ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్విట్టర్ రివ్యూ.. సూర్య ఖాతాలో మరో హిట్ పడినట్టేనా?
ఇక ఈ చిత్రం ఏ ఓటీటీలోకి రానుంది అనే విషయం తెలిసిపోయింది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర టైటిల్ కార్డులో వెల్లడించారు.
ఈ చిత్రం విడుదలైన నెల రోజుల తరువాతనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు.
