×
Ad

NTR : 25 ఏళ్ళ తర్వాత సీఎం అంటున్న ఫ్యాన్స్.. ఎన్టీఆర్ మౌనం.. కర్ణాటక మీద ఎన్టీఆర్ ప్రేమ..

తాజాగా నేడు ఉదయం ఎన్టీఆర్ బెంగుళూరులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. (NTR)

  • Published On : March 8, 2026 / 05:06 PM IST

NTR

  • బెంగుళూరులో ఎన్టీఆర్
  • హాస్పిటల్ ఓపెనింగ్ లో సందడి
  • సీఎం అంటూ ఫ్యాన్స్ అరుపులు

NTR : ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా నేడు ఉదయం ఎన్టీఆర్ బెంగుళూరులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ ఈవెంట్ కి ఫ్యాన్స్ కూడా భారీగా తరలి వచ్చారు.

ఈ హాస్పిటల్ ఓపెనింగ్ తర్వాత ఎన్టీఆర్ మాట్లాడే ముందు హోస్ట్ ముచ్చటించారు. ఈ క్రమంలో 25 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ ఏంటి అని అడిగారు. ఎన్టీఆర్ కాసేపు మౌనం వహించి 25 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ కి 67 ఏళ్ళు వస్తాయి అని అన్నారు. అయితే ఎన్టీఆర్ మాట్లాడే లోపే ఫ్యాన్స్ ఎన్టీఆర్ అప్పటికి సీఎం అవుతారంటూ సీఎం సీఎం అని అరిచారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీఎం సీఎం అని అరుస్తుంటే ఎన్టీఆర్ మాత్రం స్టేజిపై మౌనంగా ఉన్నారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Also Read : Bellamkonda Sai Sreenivas : నిశ్చితార్థం చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఫోటోలు వైరల్..

ఎన్టీఆర్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కానీ గత కొన్నేళ్లుగా పాలిటిక్స్ కి చాలా దూరంగా ఉంటున్నారు ఎన్టీఆర్. ఇప్పుడు ఫ్యాన్స్ సీఎం సీఎం అని అరవడంతో మరోసారి ఎన్టీఆర్ చర్చగా మారారు.

ఇక ఇదే ఈవెంట్లో ఎన్టీఆర్ కన్నడలోనే మాట్లాడారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. కర్ణాటకకు రావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు మా అమ్మ ఊరు ఇక్కడే కర్ణాటకలోని కుందాపూర్. అందుకే నాకు కర్ణాటక రావడం అంటే నాన్న ఇంటి నుంచి అమ్మ ఇంటికి వచ్చినట్టు ఉంటుంది అని అన్నారు.

Also Read : RJ Surya : పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ సూర్య.. పెళ్లి ఫోటోలు వైరల్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?