Geeta Singh
Geeta Singh : కితకితలు సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న గీతా సింగ్ ఆ తర్వాత పలు సినిమాల్లో కమెడియన్ గా నటించి మెప్పించింది. మధ్యలో తన ఫ్యామిలీ సమస్యలతో సినిమాలకు దూరమైన గీతా సింగ్ ఇటీవలే మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గీతా సింగ్ తనకు జరిగిన ఓ మోసం గురించి చెప్తూ ఎమోషనల్ అయింది. (Geeta Singh)
గీతా సింగ్ మాట్లాడుతూ.. నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాను. సినీ పరిశ్రమలోనే బాగా తెలిసినామె దగ్గరే చీటీ వేసాను. 22 లక్షల దాకా కట్టాను. అవసరం అయి వాళ్ళింటికి వెళ్లి అడిగాను. సరే రెడీ చేస్తాను అని చెప్పింది. నేను వాళ్ళింటికి వెళ్ళినప్పుడు వాళ్ళింట్లో సామాన్లు ఏమి లేవు. అడిగితే ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అని చెప్పింది. కట్ చేస్తే రాత్రికి రాత్రి పరార్ అయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది.
Also Read : Geeta Singh : మంచు విష్ణు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు.. జాబ్ రాగానే చనిపోయాడు.. గీతా సింగ్ ఎమోషనల్..
రూపాయి రూపాయి దాచుకొని వాళ్లకు ఇస్తే అలా జరిగింది. ఇది జరిగి 8 ఏళ్ళు అవుతుంది అయినా ఇంకా ఒక్క రూపాయి కూడా రాలేదు. కోర్ట్ లో కేసు ఇంకా నడుస్తుంది. ఆమె కనీసం పట్టించుకోదు. ఆమెని చూస్తే కొట్టాలనిపిస్తుంది. ఒక అమ్మాయే ఇంకో అమ్మాయి బాధని అర్ధం చేసుకోకపోతే ఎలా. నేను సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు మా అక్క వచ్చి తిట్టి లైన్లో పెట్టింది అని చెప్తూ ఎమోషనల్ అయింది.