Band Melam OTT: ఓటీటీలో కొత్త సినిమా.. ‘బ్యాండ్ మేళం’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం మూవీ ఓటీటీ(Band Melam OTT) స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.
- V Santhosh Kumar
- Published on- April 17, 2026 / 01:38 PM IST
Harsh Roshan, Sridevi band melam movie ott streaming update
Band Melam OTT: ‘కోర్ట్’ వంటి వినూత్న చిత్రంతో మెప్పించిన హిట్ పెయిర్ హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘బ్యాండ్ మేళం(Band Melam OTT)’. సతీష్ జివ్వాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మార్చి నెలలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన ఈ వినోదాత్మక చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫారమ్లో సందడి చేయడానికి సిద్ధమైంది.
Suyodhana OTT: సైలెంట్ గా ఓటీటీకి వచ్చేసిన ‘సుయోధన’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’ (Zee 5) ఈ సినిమా స్ట్రీమింగ్ వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 24 నుంచి ‘బ్యాండ్ మేళం’ ఈ ప్లాట్ఫారమ్లో అందుబాటులోకి రానుంది. “మీరు మెచ్చిన జంట మరోసారి దరువేయబోతోంది.. మీరు సిద్ధమా?” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రేక్షకుల ఆసక్తిని పెంచేసింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు, ఇప్పుడు ఓటీటీ వేదికగా ఈ ఫన్ రైడ్ను ఎంజాయ్ చేయవచ్చు.
