Bollywood Drugs Case: రియాకు బెయిల్ మంజూరు.. కానీ..

  • Publish Date - October 7, 2020 / 12:19 PM IST

Rhea Chakraborty: బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సుశాంత్ మాజీ ప్రేయసి, హీరోయిన్ రియా చక్రవర్తికి ఊరట లభించింది. సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూడడంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) రంగంలోకి దిగి రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు మరో నలుగురుని అరెస్ట్ చేశారు. కాగా వీరి కస్టడిని అక్టోబర్ 20 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ముంబై సెషన్స్ కోర్టు తాజాగా రియాకు బెయిల్ మంజూరు చేసింది.



ఆమె సోదరుడు షోవిక్ కు మాత్రం బెయిల్ నిరాకరించింది న్యాయస్థానం.
కాగా సెప్టెంబర్‌ 8నుంచి రియా జైల్లోనే ఉంది. సెప్టెంబర్‌ 30న ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వులో ఉంచింది. సుశాంత్‌కు డ్రగ్స్‌ సరఫరా చేయడంలో రియా హస్తం ఉందని స్పష్టం చేస్తూ.. బెయిల్‌ ఇవ్వొద్దని న్యాయస్థానాకి ఎన్సీబీ విజ్ఞప్తి చేసింది.


రియా, ఆమె సోదరుడు డ్రగ్స్‌ సరఫరా చేశారని, అది తీవ్రతరమైన నేరమని ఎన్సీబీ అధికారులు కోర్టుకు తెలిపారు. అయితే అన్ని వాదనలు విన్న కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆమె ముంబై విడిచి వెళ్లరాదని, లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అలాగే ప్రతి పదిరోజులకి స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం చేయాలని కూడా ఆదేశించింది కోర్టు.


ట్రెండింగ్ వార్తలు