రాజమౌళి, మహేష్ సినిమా ఓపెనింగ్‌కి.. జేమ్స్ కామెరాన్ అతిథిగా..

రాజమౌళి, మహేష్ సినిమా ఓపెనింగ్‌కి ముఖ్య అతిథిగా వరల్డ్ టాప్ డైరెక్టర్ 'జేమ్స్ కామెరాన్' రాబోతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

James Cameron will come as guest for Mahesh Babu Rajamouli SSMB 29 Movie opening

SSMB29 : టాలీవుడ్ ఆడియన్స్ అంతా రాజమౌళి, మహేష్ బాబు సినిమా ఎప్పుడు మొదలవుతుందో అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇండియానా జోన్స్ తరహాలో అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని రాజమౌళి.. హాలీవుడ్ స్థాయిలో రూపొందించడానికి సిద్ధమయ్యారు. ఈక్రమంలోనే హాలీవుడ్ కంపెనీస్ తో కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది మేలో స్టార్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ మూవీ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా వరల్డ్ టాప్ డైరెక్టర్ ‘జేమ్స్ కామెరాన్’ రాబోతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా చూసి జేమ్స్ కామెరాన్.. రాజమౌళి వర్క్ కి ఫిదా అయ్యిపోయారు. అవతార్ లాంటి గొప్ప సినిమాలను తెరకెక్కించిన కామెరాన్.. ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతూ ఓ ప్రత్యేక వీడియో చేయడం గమనార్హం. ఇటీవల ఓ అవార్డుల వేడుకల్లో కూడా కామెరాన్.. రాజమౌళి వర్క్ గురించి మాట్లాడడం విశేషం.

Also read : Pankaj Udhas : మ్యూజిక్ లెజెండ్ ‘పంకజ్ ఉదాస్’ కన్నుమూత..

రాజమౌళి వర్క్ కి ఫిదా అయిన జేమ్స్ కామెరాన్.. SSMB29 మూవీ ఓపెనింగ్ వచ్చినా పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే.. ఓపెనింగ్ ఈవెంట్ వరకు ఎదురు చూడాలి, లేదంటే మూవీ యూనిట్ నుంచి అనౌన్స్‌మెంట్ రావాలి. కాగా గతంలో తమిళ దర్శకుడు శంకర్.. తన ‘ఐ’ మూవీ ఫంక్షన్ కి హాలీవుడ్ స్టార్ హీరో ‘ఆర్నాల్డ్’ అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక SSMB29 విషయానికి వస్తే.. కె ఎల్ నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎస్ గోపాల్ రెడ్డి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక మహేష్ బాబుకి జోడిగా ఇండోనేషియా యాక్ట్రెస్ ‘చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్’ని ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా టైటిల్ ని ఏమో ‘మహారాజ’ అని ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్ సమాచారం. మహేష్ పేరులో మహా, రాజమౌళి పేరులో రాజా తీసుకొని ‘మహారాజ’ అనే టైటిల్ ని అనుకుంటున్నారట.

 

ట్రెండింగ్ వార్తలు