Kangana Ranaut: కంగనా కొత్త ప్రొడక్షన్ మొదలుపెట్టేసింది..

బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌట్ కీలక నిర్ణయం తీసుకుంది. వెండితెరపై కనిపించి ప్రేక్షకులకు అలరించిన కంగనా..

Kangana Ranaut: బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌట్ కీలక నిర్ణయం తీసుకుంది. వెండితెరపై కనిపించి ప్రేక్షకులకు అలరించిన కంగనా.. త్వరలో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఆమెకు జాతియ అవార్డు తెచ్చిపెట్టిన ‘మణికర్ణిక’ చిత్రంపేరునే కంగనా తన బ్యానర్‌కు పెట్టుకుంది. తొలి ప్రయత్నంగా మెయిన్ స్ట్రీమ్ మూవీతో కాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్ పై కన్నేసింది. దాని కోసమే ప్రత్యేకంగా సినిమాను నిర్మిస్తోంది.

నూతన నటీనటులతో క్యూట్ లవ్ స్టోరీగా ‘టీకూ వెడ్స్ షేరూ’ పేరుతో సినిమా తీయబోతున్నట్టు ట్వీటర్‌ వేదికగా కంగనా వెల్లడించింది. అలాగే తన ప్రొడక్షన్ హౌస్ లోగోను శనివారం పోస్టు చేసింది. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరు తమను ఆశీర్వదించాలని కోరింది.

‘టీకూ వెడ్స్ షెరూ సినిమాతో మణికర్ణిక ఫిలిమ్స్ డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇది ఒక సెటైరికల్ కామెడీతో కూడిన ప్రేమ కథ. కొత్త రకం వినోదాన్ని ఈ సినిమా ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాక, మా ప్రొడక్షన్ సంస్థ నుంచి కొత్త టాలెంట్‌ని, కొత్త కాన్సెప్ట్‌లని పరిచయం చేస్తాం. సాధారణ సినిమాలు చూసే ప్రేక్షకుల కంటే.. డిజిటల్ సినిమాలు చూసే ప్రేక్షకులు కాస్త పరిణితి చెందిన వాళ్లు అని మా ఫీలింగ్’ అని కంగనా మనసులో మాట చెప్పింది.

ఇదిలా ఉంటే… కంగనా రనౌత్ నటించిన జయలలిత బయోపిక్ ‘తలైవి’ విడుదల కావాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు