Kangana Ranaut: మంచు విష్ణుకి కంగనా థాంక్స్.. ఎందుకంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణుకి కృతజ్ఞతలు తెలిపారు. కంగనా రనౌత్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.

Kangana Ranaut: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణుకి కృతజ్ఞతలు తెలిపారు. కంగనా రనౌత్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన ‘ధాకడ్‌’ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆమె శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న కంగనా.. మంచు విష్ణుతో పాటు ఏవీ ధర్మారెడ్డికి స్పెషల్ థాంక్స్ చెప్పారు.

Kangana Ranaut : ధాకడ్ సినిమా విజయవంతం కావాలని.. శ్రీవారిని దర్శించుకున్న కంగనా రౌనత్

ఈరోజు బుద్ధపూర్ణిమ కావడంతో నేను, ‘ధాకడ్’ చిత్ర నిర్మా త దీపక్ ముఖత్, అతని సతీమణి కృష్ణ ముఖత్ తో పాటు చిత్రబృందంలోని కొంతమంది కలిసి శ్రీవారిని దర్శించుకున్నాం. తిరుమల దర్శనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లను చేసిన మా అధ్యక్షుడు మంచు విష్ణుకు, ధర్మారెడ్డి గారికి స్పె షల్ థాంక్స్ అని చెప్పుకొచ్చింది కంగనా రనౌత్. దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లతో పాటు.. తిరుమలలో విశ్రాంతికి కూడా వారు ప్రత్యేక ఏర్పాట్లు చేయించినట్లు తెలుస్తోంది.

Kangana Ranaut : ఆ స్టార్ హీరోలు నా సినిమాని ప్రమోట్ చేయరు.. నాకు ఎక్కువ పేరు వస్తుందని ఫీల్ అవుతారు..

కంగనా నటించిన ‘ధాకడ్’ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీష్‌ఘయ్‌ దర్శకత్వం వహించిన ‘ధాకడ్‌’ మూవీలో కంగనా రనౌత్‌ ఏజెంట్‌ అగ్నిగా నటించింది. మరి ఈ సినిమాతో ఫైర్ బ్రాండ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ‘తలైవి’ తర్వాత కంగనా నటించిన సినిమా ఇదే. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్ గా ఉంటూ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కంగనా ఏజెంట్ అగ్నిగా ఎలా అలరిస్తుందో చూడాలి.