Magadheera : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కెరీర్ లో రెండో సినిమాగా వచ్చిన మగధీర అప్పట్లో భారీ విజయం సాధించి ఇండస్ట్రీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమా 40 కోట్లతో తెరకెక్కగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. రెండో సినిమాతోనే చరణ్ ఇండస్ట్రీ హిట్ కొట్టి అప్పట్లో సంచలనం సృష్టించాడు.
ఒకప్పటి మంచి సినిమాలు ఇటీవల రీ రిలీజ్ అవుతున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే చరణ్ ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ అయి కలెక్షన్స్ కూడా బాగా వసూలు చేసింది. ఇప్పుడు మగధీర సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మార్చ్ 27 చరణ్ పుట్టిన కావడంతో ముందురోజే అభిమానుల కోరిక మేరకు మార్చ్ 26న మగధీర సినిమాని గ్రాండ్ గా జారీ రిలీజ్ చేయనున్నారు.
Also Read : Hanuman : ఓటీటీలో కూడా సరికొత్త రికార్డ్ సెట్ చేసిన ‘హనుమాన్’.. కేవలం 11 గంటల్లోనే..
శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ అధినేతలు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిషోర్ బాబు ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. మగధీర రీ రిలీజ్ చేసే అవకాశం వీరికి కల్పించడంతో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇక థియేటర్స్ లో చరణ్ అభిమానులు ఏ రేంజ్ లో రచ్చ చేస్తారో చూడాలి.