Mahesh Babu Guntur Kaaram pre release event is cancelled
Guntur Kaaram : త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’.. మరో వారంలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుకుంటుంది. ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసిన ఈ మూవీ మేకర్స్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్ చేసుకొని ఫ్యాన్స్ కి కూడా తెలియజేశారు.
జనవరి 6 శనివారం నాడు ఈ ఈవెంట్ ని నిర్వహిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆ ఈవెంట్ ని క్యాన్సిల్ చేసినట్లు అనౌన్స్ చేశారు. పోలీసు వారి పర్మిషన్ లభించక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని పోస్టుపోన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. త్వరలోనే కొత్త డేట్ని, వేదికని అనౌన్స్ చేస్తామంటూ ప్రకటించారు. ఇక ఈ వార్తతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.
Also read : Prabhas : మారుతీ సినిమా స్టోరీ లైన్ ఏంటో చెప్పిన ప్రభాస్..
Despite our best efforts, due to unforeseen circumstances and issues with security permissions, we will not be conducting the highly awaited #GunturKaaram Pre-release event on 6th January 2024. We sincerely apologize for this announcement 💔
The new date for the event with the…
— Haarika & Hassine Creations (@haarikahassine) January 5, 2024
కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మహేష్ బాబు మరో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేయబోతున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికా థియేటర్స్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కాలిఫోర్నియా సినీ లాంజ్ ఫ్రీమాంట్ సెవెన్ సినిమాస్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్ చేయబోతున్నారు. ఇలా ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో లైవ్ ఇవ్వడం ఇదే మొదటిసారి. దీంతో మహేష్ బాబు మరో కొత్త ట్రెండ్ ని సెట్ చేసి.. ట్రెండ్ సెట్టర్ అనిపించుకుంటున్నారు. గతంలో టీజర్, గ్లింప్స్, మోషన్ పోస్టర్, రీ రిలీజ్.. ఇలా చాలా ట్రెండ్స్ ని మహేషే స్టార్ట్ చేశారు.