Indira Devi: మహేశ్ బాబుకు మాతృవియోగం.. అనారోగ్యంతో కన్నుమూసిన ఇందిరాదేవి
మహేశ్ బాబు మాతృమూర్తి, ‘సూపర్ స్టార్’ కృష్ణ సతీమణి ఇందిరా దేవి బుధవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఆమె నివాసంలో తుది శ్వాస విడిచారు.
- Narender Thiru
- Published On : September 28, 2022 / 07:36 AM IST
Indira Devi: ‘సూపర్ స్టార్’ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి (70) అనారోగ్యంతో కన్నుమూశారు. ఫిల్మ్ నగర్, పద్మాలయ స్టూడియో పరిధిలో నివాసం ఉంటున్న ఇందిరా దేవి బుధవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.
World No-3: అయ్యయ్యో అదానీ ర్యాంకు మళ్లీ పడిపోయింది.. రెండోసారి మూడో స్థానంలోకి ఆసియా కుబేరుడు
‘సూపర్ స్టార్’ కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి. వారికి ఐదుగురు సంతానం. రమేశ్ బాబు, మహేశ్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని వారి సంతానం. వీరిలో రమేష్ బాబు కొద్ది రోజుల క్రితమే కన్నుమూశారు.
