మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ‘ఓ పిట్టకథ’ ప్రీ రిలీజ్ ఈవెంట్..
భారీ చిత్రాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న భవ్య క్రియేషన్స్ సంస్థ తొలిసారిగా కొత్త తారలతో.. కొత్త దర్శకుడితో నిర్మించిన సరికొత్త కంటెంట్ ఫిల్మ్.. ‘ఓ పిట్టకథ’. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు, నిత్యా శెట్టి హీరో హీరోయిన్లుగా, బ్రహ్మాజీ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 6న రిలీజ్ కానుంది.
చెందు ముద్దు దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 1న హైదరాబాద్లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ : ‘‘కథను నమ్మి తీసిన సినిమా ఇది. ఇప్పటికే మా ప్రచార చిత్రాలకు మంచి రెస్సాన్స్ లభిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా చాలా గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నాం. చిరంజీవి గారి రాకతో మా సినిమాకి ఓ కొత్త ఊపు రాబోతుంది. ఆయన ఈ ఫంక్షన్కి రావడానికి అంగీకరించినందుకు చాలా చాలా థ్యాంక్స్’’ అన్నారు.