Rajendra Prasad: నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్‌కి కరోనా పాజిటివ్

వరుసగా టాలీవుడ్ సెలబ్రిటీలకు ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ వస్తుంది.

  • Published On : January 9, 2022 / 03:24 PM IST

Rajendra

Rajendra Prasad: వరుసగా టాలీవుడ్ సెలబ్రిటీలకు ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ వస్తుంది. లేటెస్ట్‌గా నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది.

కోవిడ్‌కు సంబంధించి స్వల్స లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చిందని అతని సంబంధికులు వెల్లడించారు.

కొవిడ్ స్వల్ప లక్షణాలు మాత్రమే రాజేంద్రప్రసాద్‌లో కనిపించాయని. ప్రస్తుతం ఏఐజీ ఆస్పత్రిలో రాజేంద్రప్రసాద్ చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు కుటుంబ సభ్యులు.

ఇటీవల మంచు మనోజ్, మహేశ్ బాబు, మంచు లక్ష్మీ వంటి టాలీవుడ్ నటులకు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే.

Telangana : పెళ్లై 2 వారాలు దాటింది….శవమై తేలాడు