Kaliyugam Pattanamlo : విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ల నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘కలియుగం పట్టణంలో’. ఈ సినిమాలో హీరోయిన్ చిత్రాశుక్ల ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మంచి మెలోడీ పాటని విడుదల చేశారు. ‘నీ వలనే పెదవిపై.. అంటూ సాగే మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాటని భాస్కరభట్ల రాయగా అజయ్ అరసాద సంగీత దర్శకత్వంలో MM మానసీ ఆలపించారు. ఇక ఈ కలియుగ పట్టణంలో సినిమా మార్చ్ 22న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.
Also read : Akash Puri : RC ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇస్తున్నా అంటున్న ఆకాష్ పూరి..