Nivetha Pethuraj : ఇలా జరుగుతుందని తెలిస్తే అలాంటి ప్రమోషన్ చేసేదాన్ని కాదు.. నా ఫ్యామిలీ నుంచి కాల్స్ వచ్చాయి..

ఓ ప్రమోషన్ గురించి హీరోయిన్ నివేతా పేతురేజ్ మాట్లాడింది.

Nivetha Pethuraj : ఇటీవల సినిమా ప్రమోషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమాలు, వెబ్ సిరీస్ లు తమ కంటెంట్ జనాల్లోకి వెళ్ళడానికి రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. జనాల్లోకి వెళ్లి మరీ కొత్తగా ట్రై చేస్తున్నారు. ఒక్కోసారి ఇలాంటి ప్రమోషన్స్ పై విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ ప్రమోషన్ గురించి హీరోయిన్ నివేతా పేతురేజ్ మాట్లాడింది.

తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీగా ఉన్న నివేతా పేతురేజ్ ఇటీవల పరువు అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సిరీస్ అనౌన్స్ ముందు నివేత పేతురేజ్ కార్ లో వెళ్తుంటే పోలీసులు ఆపినట్టు, పోలీసులతో గొడవ పడినట్టు ఓ వీడియో రిలీజ్ చేసారు. ఈ వీడియో చూసి నిజంగానే నివేతా పోలీసులతో గొడవ పడిందని అందరూ అనుకున్నారు. కొంతమంది మాత్రం ఇదేదో సినిమా ప్రమోషన్ అనుకున్నారు.

Also Read : Kalki Movie Records : ప్రభాస్ ‘కల్కి’ సినిమా అయిదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేసిన రికార్డులు ఇవే..

అయితే ఆ ప్రమోషన్ నెగిటివ్ గా వైరల్ అయింది. నివేతా మీద సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత రోజు సిరీస్ పేరు ప్రకటించాక వివాదం సద్దుమణిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నివేతా పేతురాజ్ దీని గురించి స్పందించింది.

నివేతా మాట్లాడుతూ.. అసలు ఆ ప్రమోషన్ ఐడియా నెగిటివ్ అవుతుందని ఊహించలేదు. నెగిటివ్ కామెంట్స్ వస్తాయని తెలిస్తే అసలు ఆ ప్రమోషన్ చేసేదాన్ని కాదు. నా ఫ్యామిలీ నుంచి కూడా కాల్స్ వచ్చాయి. వాళ్ళు భయపడి నాకు కాల్ చేసారు. చాలా మంది నాకు కాల్ చేసి పోలీసులతో గొడవపడ్డవా అంటూ అడిగారు. దీంతో నేను టీమ్ కి కాల్ చేసి ప్లీజ్ టైటిల్ అయినా రిలిజ్ చేయండి అని అడిగాను. ఆ తర్వాత రోజు టైటిల్ రిలీజ్ చేశారు. అలాంటి ప్రమోషన్స్ ఇంకోసారి చేయకూడదు అనుకున్నాను అని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు