NTR family members photo with president Droupadi Murmu
NTR 100 Years : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారకరామారావు(Nandamuri Taraka Ramarao) శతజయంతి భారత్ ప్రభుత్వం.. ఎన్టీఆర్ ప్రతిమ ముద్రించిన రూ. 100 స్మారక నాణేన్ని(100 Rupees Coin) లాంచ్ చేసిన విషయం తెలిసిందే. నేడు ఆగష్టు 28న రాష్ట్రపతి సాంస్కృతిక భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. ఈ కాయిన్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, పలు పార్టీల ప్రముఖులతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరికి ఆహ్వానాలు వెళ్లాయి.
దీంతో బాలకృష్ణ, పురంధరేశ్వరి, చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. రూ. 100 స్మారక నాణేన్ని రిలీజ్ చేసిన అనంతరం ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కలిసి ఫోటో దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ పిక్ చూసిన కొందరు నందమూరి అభిమానులు.. ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్ (NTR), కళ్యాణ్ రామ్ (Kalyan Ram) లేరని ఫీల్ అవుతున్నారు. వారికీ కూడా ఆహ్వానం వెళ్లినప్పటికీ సినిమా షూటింగ్ కమిట్మెంట్స్ వల్ల ఇద్దరు రాలేకపోయారని కొంతమంది చెబుతున్నారు.
Tiger Nageswara Rao : ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రేమను పరిచయం చేసిన కృతిసనన్..
#TDPTwitter @rashtrapatibhvn 🇮🇳 గారితో “అన్నగారి కుటుంబం” 🥰♥️
💛💛💛💛💛💛#NationHonoursNTR 🙏#TeluguPrideNTR 🙏#JoharNTR 🔥✊ #NTR100 #NTRLivesOn #100YearsOfNTR #100YearsOfNTRLegacy #100YearsofLegendaryNTR #NTRCentenaryCelebrations pic.twitter.com/Egi7Holn2b
— Jakkampudi Chaitanya (TDP -✌🚲💛🔥💥) (@JakkampudiChai1) August 28, 2023
అయితే శతజయంతి వేడుకల్లో భాగంగా విజయవాడ, హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమానికి కూడా ఈ ఇద్దరి బ్రదర్స్ దూరంగా ఉండడం గమనార్హం. ఇప్పుడు కూడా ఇద్దరు రాకపోవడంతో నందమూరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కుటుంబంలోని పెళ్లి, ఇతర ఫంక్షన్స్ లో కనిపిస్తున్న తారక్, కళ్యాణ్ రామ్.. తమ తాత శతజయంతి వేడుకకు మాత్రం ఎందుకు దూరంగా ఉంటున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే రాజకీయాలకు దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం వల్లే ఈ ఇద్దరి బ్రదర్స్ ఈ కార్యక్రమాలకు హాజరు కాకపోవడం వెనుక ఉన్న రీజన్ అని ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. రీజన్ ఏదైనా ఈ విషయం మాత్రం తమని ఇబ్బంది పెడుతుందని నందమూరి అభిమానులు చెప్పుకొస్తున్నారు.