Prabhas – Allu Arjun : తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం ప్రభాస్, అల్లు అర్జున్ భారీ విరాళాలు.. ఎంతంటే..?

చాలా మంది సినీ స్టార్స్ రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి విరాళం ప్రకటించగా తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా విరాళం ప్రకటించారు.

Prabhas and Allu Arjun Announced Huge Amount Donation to Two Telugu States CM Relief Funds

Prabhas – Allu Arjun : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాలు నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వరదల వల్ల విజయవాడ, ఖమ్మంలోని అనేక ప్రాంతాలు మునిగిపోయాయి. ఓ పక్క ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతూనే ఉంది. ఇలాంటి విపత్తర సమయంలో తెలుగు సినీ ప్రముఖులు రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్, చిరంజీవి, మహేష్ బాబు, బాలకృష్ణ , పవన్ కళ్యాణ్.. ఇలా చాలా మంది సినీ స్టార్స్ రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి విరాళం ప్రకటించగా తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా విరాళం ప్రకటించారు.

Also Read : Sundeep Kishan : సందీప్ కిషన్ మంచి మనుసు.. విజయవాడ వరద బాధితులకు ఫుడ్, వాటర్ సప్లై.. తన టీంతో..

ప్రభాస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్స్ కి ఒక కోటి రూపాయల చొప్పున రెండు రాష్ట్రాలకు రెండు కోట్లు విరాళం ప్రకటించారు. ఈ మేరకు ప్రభాస్ టీమ్ నుంచి ప్రకటన వెలువడింది. దీంతో అభిమానులు, నెటిజన్లు ప్రభాస్ ని అభినందిస్తున్నారు. ఇటీవల ప్రభాస్ కేరళ వరద బాధితుల కోసం కూడా రెండు కోట్ల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.

అలాగే అల్లు అర్జున్ కూడా వరద బాధితుల కోసం విరాళం ప్రకటించాడు. ఈ మేరకు అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాల వల్ల ఏర్పడిన నష్టాలు చూసి నేను ఎంతో బాధపడ్డాను. ఇలాంటి విపత్తర సమయంలో నేను రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి కలిపి ఒక కోటి రూపాయలు డొనేట్ చేస్తున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అని పోస్ట్ చేసారు. దీంతో బన్నీని అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు