Puri Jagannadh: టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇటీవల లైగర్ సినిమాతో డిజాస్టర్ను మూటగట్టుకున్నాడు. ఈ సినిమా ఎఫెక్ట్ నుండి ఆయన బయటపడి, తన నెక్ట్స్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే పూరితో సినిమా చేసేందుకు హీరోలెవరూ ఆసక్తి చూపడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో పూరి, తన కొడుకు ఆకాష్ పూరితో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.
Puri Jagannadh: ఇప్పట్లో మళ్లీ దాన్ని టచ్ చేయనంటోన్న పూరీ.. నిజమేనా?
ఈ క్రమంలోనే ఆకాష్ పూరి కోసం ఓ ఎమోషనల్ యాక్షన్ కథను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కథ గతంలో వచ్చిన ‘ఇడియట్’ చిత్రానికి కొనసాగింపుగా ఉండబోతుందని తెలుస్తోంది. తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోనుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇక తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథ సాగనుందట. ఎమోషన్తో పాటు కామెడీకి పెద్దపీట వేస్తున్నాడట ఈ డైరెక్టర్.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, ఈ సినిమాను త్వరలోనే అనౌన్స్ చేసి, అంతే త్వరగా పట్టాలెక్కించేందుకు కూడా పూరి రెడీ అవుతున్నాడట. మరి పూరి ఈ సినిమాతోనైనా సక్సెస్ అందుకుని తిరిగి తన సత్తా చాటుకోవాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.