Puri Jagannadh: టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలవడంతో పూరీని ఆడియెన్స్ ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. ఈ సినిమాలో ఏముందని, దీన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేశారని లైగర్ టీమ్ను సినీ క్రిటిక్స్ కూడా విమర్శించారు. ఇక లైగర్ మూవీ ఫెయిల్యూర్తో పూరీ కొంతకాలం సైలెంట్ అయిపోయాడు.
అయితే ఇప్పుడు మళ్లీ ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏమిటో చాటాలని పూరీ చూస్తున్నాడట. కానీ, టాలీవుడ్ హీరోలందరూ ప్రస్తుతం తమ సినిమాలతో బిజీగా ఉండటంతో పూరీకి ఎవరు ఛాన్స్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. పూరీ మాత్రం తన ప్లాన్ తనకు ఉందంటూ రెడీ అవుతున్నాడు. తాను తయారు చేసిన హీరో మాస్ రాజా రవితేజతో ఓ సినిమా చేసేందుకు పూరీ సిద్ధమవుతున్నాడట. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో సెన్సేషనల్ హిట్స్ వచ్చాయి. ఆ తరువాత వీరిద్దరు కలిసి ‘దేవుడు చేసిన మనుషులు’ అనే సినిమాతో భారీ ఫ్లాప్ను మూటగట్టుకున్నారు.
ఈ సినిమా ఫెయిల్యూర్ రవితేజ-పూరీల మధ్య దూరాన్ని కూడా పెంచింది. అయితే, ఇప్పుడు మరోసారి రవితేజకు సెట్ అయ్యే కథను రెడీ చేసి, ఆయనతో సినిమా తీయాలని పూరీ ప్లాన్ చేస్తున్నాడట. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ కూడా రావొచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్న రవితేజ కూడా పూరీకి మరోసారి ఛాన్స్ ఇస్తాడని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి నిజంగానే ఈ కాంబినేషన్ మరోసారి సెట్ అవుతుందేమో చూడాలి అంటున్నారు పూరీ ఫ్యాన్స్.