Animal : ‘యానిమల్‌’కి సీక్వెల్ ఉందా..? అన్‌స్టాపబుల్ షోలో సందీవ్ వంగా ఏం చెప్పారు..?

రణబీర్ కపూర్, సందీప్ వంగా 'యానిమల్‌'కి సీక్వెల్ ఉందా..? అన్‌స్టాపబుల్ షోలో బాలయ్య అడిగిన సమాధానికి..

Ranbir Kapoor Rashmika Mandanna Animal movie had a sequel

Animal : రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘యానిమల్’. ఈ మూవీ డిసెంబర్ 1న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ వంగా, రణబీర్, రష్మిక.. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి వచ్చారు. ఈ షోలో యానిమల్ సినిమా గురించిన విషయాలతో పాటు సందీప్ వంగ, ప్రభాస్ సినిమా గురించి కూడా చర్చించారు. ఇప్పుడు వస్తున్న యానిమల్ మూవీకి నిజంగా సీక్వెల్ గా ఉందా..?

Also read : Prabhas : ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ అప్డేట్ ఇచ్చిన సందీప్ వంగా.. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా..?

ఈ షోలో సందీప్ వంగాని బాలకృష్ణతో ఎలాంటి సినిమా చేస్తావు అని ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. “ఒక పవర్ ఫుల్ సినిమా చేస్తాను. కానీ బాలకృష్ణ పాత్ర మాత్రం చాలా సెటిల్డ్ గా ఉండేలా చూసుకుంటాను. మీరు ఇప్పటి వరకు ఇలాంటి పాత్రని చేయలేదు. లోపల అగినిపర్వతం పేలుతున్న బయటకి మాత్రం చాలా సైలెంట్ కనిపిస్తూనే రుద్రం చూపించే పాత్రలో మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. మరి ఎప్పుడు సినిమా చేద్దామని బాలయ్య ప్రశించగా, రణబీర్ కలుగజేసుకొని.. “సార్ ఇతని కొన్నాళ్ళు మాకు వదిలేయండి. మాకు ఇంకా పని ఉంది” అంటూ వ్యాఖ్యానించారు.

ఇక రణబీర్ మాటలకు బాలయ్య రియాక్ట్ అవుతూ.. “యానిమల్ సీక్వెల్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా” అని ప్రశ్నించారు. దీనికి సందీప్ వంగా.. “సీక్వెల్ కి అవకాశం ఉంది. సినిమా రిలీజ్ అయిన తరువాత ఫ్యూచర్ ఏంటనేది నిర్ణయం తీసుకుంటాం” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో సీక్వెల్ అంటున్నారంటే.. యానిమల్ ఎండింగ్ ని ఎలా ప్లాన్ చేశారో అని ఆడియన్స్ లో మరికొంత క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది.

కాగా ఈ సినిమాకి సందీప్ వంగా దర్శకత్వం అవ్వడం, రిలీజ్ అయిన ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకోవడంతో.. తెలుగు ఆడియన్స్ కూడా ఈ మూవీ పై ఎక్కువ ఆసక్తినే చూపిస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యే అవకాశం కనిపిస్తుంది.

 

 

ట్రెండింగ్ వార్తలు