RT4GM : రవితేజ, గోపీచంద్ మూవీ లాంచ్.. విలన్‌గా హీరో ధనుష్ బ్రదర్..!

గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్ లో నాలుగో మూవీ లాంచ్ అయ్యింది. ఈ సినిమాలో హీరో ధనుష్ బ్రదర్..

Raviteja Gopichand Malineni RT4GM movie starts

RT4GM : టాలీవుడ్ లో గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి కాంబోలో ఇప్పటివరకు వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ కాంబినేషన్ పై రవితేజ అభిమానులతో పాటు సినీ ప్రేమికుల్లో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. తాజాగా ఈ కాంబో మరోసారి జంట కడుతూ ఇంకో సూపర్ హిట్ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. నిన్న ఈ మూవీలో నటించేబోయే క్యాస్టింగ్ గురించి తెలియజేసిన మేకర్స్.. నేడు లాంచ్ చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని ఇవాళ పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇక ఈ సినిమాలో హీరో ధనుష్ బ్రదర్, తమిళ్ దర్శకుడు సెల్వరాఘవన్ ఒక పాత్ర చేస్తున్నట్లు మేకర్స్ తెలియజేశారు. సెల్వరాఘవన్ రవితేజని ఢీ కొట్టే పాత్రలో నటించబోతున్నాడా..? అనే సందేహం నెలకుంది. తమిళ నటి ఇందుజా రవిచంద్రన్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. హీరోయిన్ గా కృతిశెట్టిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నాడు.

Also read : Anil Ravipudi : రాజమౌళి తరువాత అనిల్ రావిపూడినే.. సినిమా హిట్స్ పరంగానే కాదు..!

మరి వీరిద్దరూ ఈ మూవీతో కూడా ఆ సక్సెస్ పరంపరని కొనసాగిస్తారా లేదా చూడాలి. ఇక ప్రస్తుతం థియేటర్స్ లో కొనసాగుతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తుంది. మూవీ నిడివిని తగ్గిస్తూ చిత్ర యూనిట్ మళ్ళీ సినిమాని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రిమ్ వెర్షన్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. మొదటిరోజుతో పోలిస్తే కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి అంటూ నిర్మాతలు తెలియజేస్తున్నారు. వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకుంది.

ట్రెండింగ్ వార్తలు