Raviteja : 70ఏళ్ళ బామ్మల విషయంలో.. రవితేజ చేసిన పని అందర్నీ ఆకట్టుకుంటుంది..

70ఏళ్ళ బామ్మల విషయంలో రవితేజ చేసిన ఓ పని అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం రవితేజ, హరీష్ శంకర్ తో చేస్తున్న 'మిస్టర్ బచ్చన్' సినిమా సెట్స్‌లో..

Raviteja great gesture about senior citizens in mister bachchan

Raviteja : ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి మాస్ మహారాజాగా ఎదిగిన రవితేజ.. ఎంత ఒదిగి ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెద్ద వారి నుంచి చిన్న వారి వరకు ప్రతి ఒక్కరి గౌరవం ఇస్తూ వస్తుంటారు. ఇక తాజాగా 70ఏళ్ళ బామ్మల విషయంలో రవితేజ చేసిన ఓ పని అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం రవితేజ, హరీష్ శంకర్ తో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీ షూటింగ్ కారంపూడిలో జరుగుతుంది. ఇక అక్కడికే వెకేషన్ కి వచ్చిన 70ఏళ్ళ బామ్మలు, మిస్టర్ బచ్చన్ షూటింగ్ సెట్స్ కి వచ్చి.. ‘రవితేజని కలవడం కుదురుతుందా’ అని అడిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక అది తెలుసుకున్న రవితేజ.. షూటింగ్ అయిన తరువాత వారిని కలవడం కోసం వారిని వెతుకుంటూ వెళ్లారట. రవితేజ వెళ్లిన సమయానికి ఆ బామ్మలు భోజనం చేస్తూ ఉన్నారట.

Also read : Siddharth Anand : ఫైటర్ మూవీ రిజల్ట్‌కి.. ఆడియన్స్‌ని నిందిస్తున్న బాలీవుడ్ దర్శకుడు..

ఇక రవితేజ రావడంతో.. వారు భోజనం ఆపేసి రాబోయారు. కానీ రవితేజ వారిని భోజనం చేసి రండి.. ‘నేను అప్పటి వరకు వెయిట్ చేస్తానని’ చెప్పారట. దీంతో వారి భోజనం అయ్యేవరకు రవితేజ అక్కడే కూర్చొని ఉన్నారు. భోజనం చేసి వచ్చిన వారితో రవితేజ కొంతసేపు మాట్లాడి, ఒక ఫోటో ఇచ్చి సంతోష పరిచారు. ఆ తరువాత అక్కడి నుంచి బయలుదేరారు.

కాగా వారి కోసం రవితేజ ఎందుకు అంత సమయం ఎదురు చూశారని తన టీం అడగగా, రవితేజ చెప్పిన జవాబు అందరి గుండెను హత్తుకుందట. “వాళ్లంతా ముసలి వాళ్లు. ఇప్పుడు వారికీ ఈ చిన్న హ్యాపీ మూమెంట్ ఇస్తే, బ్రతికి ఉన్నంత కాలం ఒక తియ్యని జ్ఞాపకంగా మిగిలిపోతుంది” అంటూ చెప్పుకొచ్చారట. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. రవితేజ చేసిన పనికి నెటిజెన్స్ అంతా అభినందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు