Ramarao On Duty: రామారావు రెమ్యునరేషన్‌పై రవితేజ క్లారిటీ!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా షూటింగ్ సమయంలో తన రెమ్యునరేషన్ విషయంలో చిత్ర యూనిట్‌తో గొడవ పడినట్లుగా వార్తలు రావడంపై, తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చాడు.

Ramarao On Duty: మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మరికొద్ది రోజుల్లో రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Ramarao On Duty: మాస్ రాజా కోసం మాస్ డైరెక్టర్స్..!

అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రవితేజ రెమ్యునరేషన్ విషయంలో ఓ వివాదం చోటు చేసుకున్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై హీరో రవితేజ క్లారిటీ ఇచ్చాడు. రామారావు ఆన్ డ్యూటీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవితేజ, ఈ సినిమా విషయంలో తనకు రెమ్యునరేషన్ కోసం గొడవ పడాల్సిన అవసరం రాలేదని.. నిజానికి తాను కూడా ఈ సినిమాకు ఒక కో-ప్రొడ్యూసర్ అని.. అలాంటప్పుడు రెమ్యునరేషన్ విషయంలో చిత్ర యూనిట్‌తో తనకు గొడవ ఎందుకు జరుగుతుందని ఆయన అన్నారు.

Ramarao On Duty: ‘రామారావు ఇన్ యాక్షన్’ మేకింగ్ వీడియో

దీంతో రవితేజ రెమ్యునరేషన్ కోసం రామారావు ఆన్ డ్యూటీ చిత్ర యూనిట్ సభ్యులతో గొడవ పెట్టుకున్నట్లుగా వచ్చిన వార్తలకు ఫుల్ స్టాప్ పడిందని చెప్పాలి. ఫ్యాన్స్ ఇలాంటి పుకార్లను పట్టించుకోవద్దని, సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, థియేటర్లకు వెళ్లి ఎంజాయ్ చేయాల్సిందిగా రవితేజ తన అభిమానులను కోరాడు. ఇక ఈ సినిమాను శరత్ మండవ తెరకెక్కించగా, ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను జూలై 29న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు