Sai Dharam Tej : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మెయిన్ లీడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తూ చేస్తున్న మెగా మల్టీస్టారర్ మూవీ బ్రో. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సోషియో ఫాంటసీ డ్రామాగా రాబోతుంది. గోపాల గోపాల మూవీ తరువాత పవన్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్స్ మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేశాయి. ఈ నెల 28న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
Sai Dharam Tej : తిక్క హీరోయిన్తో లవ్ స్టోరీ గురించి తేజ్ కామెంట్స్.. ఆ పేరులో ఒక వైబ్రేషన్ ఉంది..
దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానుల సందడి కనిపిస్తుంది. భారీ కట్ అవుట్స్ ఏర్పాటు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక ఈ బ్యానర్స్ గురించి అభిమానులకు సాయి ధరమ్ తేజ్ కొన్ని సూచనలు ఇస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఆ నోట్లో.. “బ్యానర్స్ అండ్ భారీ కట్ అవుట్స్ ఏర్పాటు చేస్తూ మీరు మా పై చూపే అభిమానం మాకు అర్ధమవుతుంది. దానికి ఎప్పుడు రుణపడి ఉంటాము. అయితే ఈ ప్రేమ చూపించే క్రమంలో జాగ్రత్త వహించండి. బ్యానర్స్ ఏర్పాటు చేసే ఉత్సాహంతో ప్రమాదానికి గురి అయితే అది మమ్మల్ని ఎంతో బాధకి గురి చేస్తుంది. కాబట్టి అందరూ జాగ్రత్త ఉండండి” అంటూ పేర్కొన్నాడు.
Bholaa Shankar : రామ్ చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడురా.. చిరంజీవి భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్..
మీ ప్రేమకి చాలా చాలా థాంక్స్!!!
దయచేసి జాగ్రతగా ఉండండి.#BroTheAvatar pic.twitter.com/yVb1x9ujNQ— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 27, 2023
కాగా ఇటీవల తమిళ్ హీరో సూర్య (Suriya) పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని ముగ్గురు అభిమానులు.. బర్త్ డే బ్యానర్ ఏర్పాటు చేసే సమయంలో కరెంటు షాక్ కి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కుర్రాళ్ళు అక్కడిక్కడే మరణించగా, మరో కుర్రాడు మాత్రం తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఇక విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే తేజ్ ఇప్పుడు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది.