డ్యూటీ ఫస్ట్.. ఫ్యామిలీ నెక్స్ట్.. కరోనాపై పోరుకి కూతురు, కొడుకుతో సాయి కుమార్ షార్ట్ ఫిల్మ్..

కరోనాపై పోరాటానికి డైలాగ్ కింగ్ సాయి కుమార్ తన కూతురు, కొడుకుతో కలిసి షార్ట్ ఫిల్మ్ రూపొందించారు..

  • Publish Date - April 10, 2020 / 06:34 AM IST

కరోనాపై పోరాటానికి డైలాగ్ కింగ్ సాయి కుమార్ తన కూతురు, కొడుకుతో కలిసి షార్ట్ ఫిల్మ్ రూపొందించారు..

కరోనా మహమ్మారి రోజురోజుకి ఎంత తీవ్రత చూపుతుందో.. ఈ వైరస్ ధాటికి ప్రపంచం చిగురుటాకులా ఎలా వణికిపోతోందో చూస్తూనే ఉన్నాం. దీంతో వైరస్‌ని అరికట్టడానికి ప్రపంచమంతా కృషి చేస్తుంది. అందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నసంగతి తెలిసిందే. తమ వంతుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా ముందుకొచ్చి పలు కార్యక్రమాలు చేపడుతోంది.

కరోనాను కట్టడి చేసే పనిలో భాగంగా డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఇటీవల 5 లక్షల నాలుగు రూపాయలను సినీ కార్మికుల సంక్షేమం కోసం, 2 లక్షలు డబ్బింగ్ యూనియన్‌కు విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు తన కొడుకు ఆది ,కూతురు డాక్టర్ జ్యోతిర్మయితో కలిసి కరోనా వైరస్ అవైర్నెస్ మీద ఒక షార్ట్ ఫిలిం రూపొందించారు.

కరోనా మహమ్మరిని నియంత్రించడానికి డాక్టర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి మరువలేనిది, వారికి సెల్యూట్ చేస్తూ తీసిన ఈ షార్ట్ ఫిలింకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. సాయి కుమార్ తన కుమారుడు ఆది సాయి కుమార్, కుమార్తె డాక్టర్ జ్యోతిర్మయి కవిపురపు ఈ లఘు చిత్రంలో కలిసి నటించడం విశేషం. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ షార్ట్ ఫిలింను నిర్మించడం జరిగింది. అందరం జాగ్రత్తలు పాటిస్తూ కరోనాను తరిమికొడదాం..

Read Also : సలహా ఇచ్చాడని చితకబాదారు.. రియాజ్ ఖాన్‌పై దాడి

ట్రెండింగ్ వార్తలు