Sampath Nandi Odela Railway Station Sequel announced with Tamannaah Bhatia
Tamannaah : చాలా వరకు సీక్వెల్ సినిమాల్లో అదే పాత్రలని కొనసాగిస్తారు. అలాగే కొత్త పాత్రలని కూడా తీసుకొస్తారు. కానీ మెయిన్ లీడ్స్ ని కూడా మార్చడం అంటే కొత్తగా ట్రై చేస్తున్నట్టే. సంపత్ నంది(Sampath Nandi) క్రియేటివ్ హెడ్ గా గతంలో హెబ్బా పటేల్(Hebah Patel) మెయిన్ లీడ్ లో అశోక్ తేజ దర్శకత్వంలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ నిర్మాణంలో ‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా డైరెక్ట్ ‘ఆహా’లో 2022 ఆగస్టులో రిలీజయింది.
ఓదెల రైల్వే స్టేషన్ సినిమా ప్రేక్షకులని మెప్పించింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ప్రకటించారు. ‘ఓదెల 2’గా(Odela 2) ఈ సినిమా సీక్వెల్ రానుంది. కానీ ఈ సారి హెబ్బా పటేల్ ని పక్కన పెట్టి తమన్నాని మెయిన్ లీడ్ లోకి తీసుకున్నారు. సూపర్ న్యాచురల్ థ్రిల్లింగ్ సబ్జెక్టుతో రాబోతున్నారు మూవీ యూనిట్. ఈ సీక్వెల్ లో హెబ్బా పటేల్ కూడా ఉంటుంది కానీ మెయిన్ లీడ్ మాత్రం ఈ సారి తమన్నా అని తెలుస్తుంది.
నిన్న కాశీలో ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మూవీ యూనిట్ తో పాటు తమన్నా కూడా విచ్చేసింది. సంపత్ నంది ఓదెల 2 పోస్టర్, పూజా కార్యక్రమం ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ సరి మరింత థ్రిల్ అవుతారు అని తెలిపాడు. అలాగే ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.