Shahrukh Khan : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, దీపికా పదుకొణె నటిస్తున్న ‘పఠాన్’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్ అబ్రహం ప్రతినాయకుడు పాత్రని పోషిస్తున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాని దాదాపు రూ 250 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.
అయితే చిత్ర యూనిట్ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టాలనే ఆలోచనతో షారుఖ్ కి తెలపగా అందుకు ఆయన అంగీకరించలేదు అంటూ వార్తలు వస్తున్నాయి. కారణం బాలీవుడ్ లో నడుస్తున్న బాయ్కాట్ ట్రెండ్. ఇప్పటికే బాలీవుడ్లోని అగ్రహీరోలు అగ్రనిర్మాతలు ఈ బాయ్కాట్ బారిన పడి భారీగా నష్టపోయారు. అయితే ఈ చిత్రంపై ఇప్పటినుంచే బాయ్ కాట్ హ్యాష్ టాగ్ నడుస్తుంది.
దీంతో షారుఖ్ ఖాన్ సినిమా విడుదల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటినుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే ఆ సమయానికి సినిమాపై వెతిరేకత తీవ్ర స్థాయిలో ఉంటుందని భావించిన షారుక్ ప్రమోషన్స్ కి ‘నో’ చెప్పాడు అని తెలుస్తుంది. అయితే ఈ విషయంలో నిజమేమిటి అనేది మాత్రం తెలియాలి. ఏదేమైనా ప్రస్తుతం బాలీవుడ్ కి గడ్డు కాలం నడుస్తుంది అనే చెప్పాలి.