Siddharth : కన్నడలో జరిగిన దానికి కూడా పెద్ద బాధ పడలేదు.. కానీ తెలుగులో.. స్టేజిపై ఏడ్చేసిన సిద్దార్థ్..

'చిన్నా' మూవీ ప్రమోషన్స్ లో సిద్దార్థ్ మాట్లాడుతూ.. ఈ రెండు నెలల్లో తెలుగులో తను ఎదుర్కొన్న విషయాలు ఎంతో బాధ పెట్టాయంటూ ఎమోషనల్ అయ్యాడు.

Siddharth comments on telugu film industry distributors

Siddharth : హీరో సిద్దార్థ్ ప్రస్తుతం ‘చిన్నా’ (Chinna) అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తమిళంలో ‘చిత్తా’ అనే పేరుతో రిలీజ్ అయ్యి మంచి విజయం అందుకున్న ఈ మూవీ.. అక్టోబర్ 6న తెలుగులో రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సిద్దార్థ్ తాజాగా తెలుగులో ఒక ప్రెస్ మీట్ నిర్వహించాడు. ఈ ఈవెంట్ లో సిద్దార్థ్ మాట్లాడుతూ కొంత ఎమోషనల్ అయ్యాడు.

ఈ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యి గత వారమే టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు రావాల్సింది. కానీ కొన్ని కారణాలు వల్ల రాలేకపోయింది. ఆ కారణాలనే సిద్దార్థ్ నేడు ఆడియన్స్ కి చెప్పుకొని బాధ పడ్డాడు. సిద్దార్థ్ తమిళ్ సినిమాలతో పరిచయం అయినప్పటికీ తెలుగు చిత్రాలతోనే స్టార్ స్టేటస్ ని అందుకున్నాడు. ఇక్కడ ఆడియన్స్ కూడా తనని ఎంతో ఓన్ చేసుకున్నారు. అయితే ఇక్కడ నటించిన సినిమా ప్లాపులు అవ్వడం, అవకాశాలు తగ్గడంతో సిద్దార్థ్ మళ్ళీ తిరిగి కోలీవుడ్ కి వెళ్ళిపోయాడు. అక్కడ నటించిన సినిమాలనే డబ్ చేసి ఇక్కడ అభిమానుల కోసం తీసుకు వస్తున్నాడు.

Also Read : Siddharth : నాకు నంది అవార్డు రాలేదు.. తెలుగులో ఇక సినిమాలు రిలీజ్ చేయను..

ఈక్రమంలోనే ‘చిన్నా’ చిత్రాన్ని కూడా సెప్టెంబర్ 28న రిలీజ్ చేయాలని భావించి తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ ని కలిసే ప్రయత్నం చేశాడు. కానీ కొందరు డిస్ట్రిబ్యూటర్స్ సిద్దార్థ్ సక్సెస్ రేట్ చూసి సినిమా కొనడానికి ఆసక్తి చూపించలేదట. తనని స్టార్ చేసిన వారే ఇప్పుడు పట్టించుకోవడం లేదా అని సిద్దార్థ్ కి బాధ వేసిందట. ఇటీవల కన్నడ ప్రమోషన్స్ లో కావేరి జలాల నిరసన సెగ తగిలి ప్రెస్ మీట్ మధ్యలోనే సిద్దార్థ్ అక్కడి నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆ విషయం కంటే.. తెలుగులో జరిగిన ఈ విషయం తనని చాలా బాధ పెట్టింది అంటూ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు