Single Screens : సింగిల్ స్క్రీన్స్ షట్ డౌన్.?

మల్టీప్లెక్స్‌లలో అమలవుతున్న పర్సెంటేజీ విధానాన్ని సింగిల్ స్క్రీన్లలోనూ (Single Screens) కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Single Screens To Shutdown In Telugu States

Single Screens : చాలా రోజులుగా తెలుగు రాష్ట్రాల‌లో సినిమాలు, థియేట‌ర్ల చుట్టూ అనేక ఇష్యూస్ జరిగాయి. కొంత‌కాలం సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు బంద్ కూడా చేశారు. అయితే దశాబ్దాలుగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఫిక్స్‌డ్ అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా నిర్మాత థియేటర్ యజమానికి అద్దె చెల్లించాలి. అయితే, ప్రస్తుతం పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, కరెంట్ బిల్లుల వల్ల అద్దె విధానంతో నష్టపోతున్నామని ఎగ్జిబిటర్లు వాదిస్తున్నారు.

మల్టీప్లెక్స్‌లలో అమలవుతున్న పర్సెంటేజీ విధానాన్ని సింగిల్ స్క్రీన్లలోనూ కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో 23 సింగల్ స్క్రీన్స్ ఏప్రిల్ 3 నుంచి పర్సెంటేజ్ షేర్‌తో రన్ చేస్తున్నాయి. జిల్లాల్లో కూడా తమకు పర్సెంటేజ్‌ షేర్ కావాలని అంటున్నారు. కొంతమంది ప్రొడ్యూసర్లు రెంటల్ సిస్టమ్‌ను కొనసాగించాలని పట్టుబట్టుతున్నారు. దీంతో గిల్డ్ వర్సెస్ తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్‌గా మారింది సీన్.

Pavithra Puri : ప‌సుపు చీరలో పూరీ జ‌గ‌న్నాథ్ కూతురు.. ప‌విత్ర ఎంత అందంగా ఉందో..

ఈ పర్సెంటేజ్ వర్సెస్ రెంటల్ వివాదం సమ్మర్‌లో రిలీజ్ కావాలనుకుంటున్న పెద్ద సినిమాలపై భారీ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. మే-జూన్‌లో వచ్చే బ్లాక్‌బస్టర్ లైనప్‌కు సింగల్ స్క్రీన్స్ లేకపోతే గ్రాస్ కలెక్షన్స్ దెబ్బతింటాయని, ప్రీ-రిలీజ్ బిజినెస్‌పై కూడా ఎఫెక్ట్ పడుతుందన్న చర్చ జరుగుతోంది.

థియేటర్లు షట్‌డౌన్ అయితే సమ్మర్ సీజన్ సైలెంట్‌గా మారిపోతుందని, బిగ్ స్టార్ల సినిమాల పరిస్థితి ఏంటన్న టెన్షన్ ఎక్కువైంది. ప్రొడ్యూసర్లు కాంప్రమైజ్ చేసుకోకపోతే ఈ వివాదం టాలీవుడ్‌ను మరో రెండు నెలలు కుదుపేసేలా ఉంది. మరి రెంటల్ వర్సెస్ పర్సెంటేజ్‌ వార్‌లో పైచేయి ఎవరిదో వేచి చూడాలి.