Sobhita Dhulipala : మోడలింగ్ వదిలి నటన వైపు అందుకే వచ్చా.. శోభిత ధూళిపాళ!

మిస్ ఇండియా అవార్డుని అందుకున్న శోభిత మోడలింగ్ ని వదిలేసి సినిమా పై అడుగులు వేయడానికి గల కారణం ఏంటనేది.. ఇప్పుడు అభిమానులకు తెలియజేసింది.

Sobhita Dhulipala Career : హీరోయిన్ శోభిత ధూళిపాళ మోడలింగ్ రంగంలో కెరీర్ ని స్టార్ట్ చేసి సినిమా రంగం వైపు అడుగులే వేసింది. మిస్ ఇండియా అవార్డుని అందుకున్న శోభిత మోడలింగ్ ని వదిలేసి సినిమా పై అడుగులు వేయడానికి గల కారణం ఏంటనేది.. ఇప్పుడు అభిమానులకు తెలియజేసింది. తాజాగా ఈ భామ ఇండియా టుడే ఎన్‌క్లేవ్ లో పాల్గొంది. ఆ ప్రోగ్రామ్ లో శోభితని మోడలింగ్ ని వదిలి సినిమా వైపు రావడానికి గల కారణం ఏంటని ప్రశ్నించారు.

RGV Vyooham : వర్మ ‘వ్యూహం’ మూవీలోని వైఎస్ జగన్, భారతి పాత్రల స్టిల్స్..

దానికి శోభిత బదులిస్తూ.. “మ్యాగజైన్ కవర్స్ అండ్ టీవీలో మోడల్స్ ని చూసి నాకు దాని ఆసక్తి కలిగింది. అలా మోడల్ గా ప్రయత్నాలు మొదలు పెట్టాను. నా కాలేజ్ చివరి రోజుల్లో నేను మిస్ ఇండియా కిరీటాన్ని అందుకున్నాను. అయితే మోడలింగ్ లో మనలోని క్రియేటివిటీ ఉపయోగించే అవకాశం ఉందదు. అప్పటి నుంచే పలు యాడ్స్ కి ఆడిషన్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. అలాగే సినిమాలకు కూడా ఆడిషన్స్ ఇచ్చాను. అక్కడ మనలోని కళని బయట పెట్టే అవకాశం నాకు కనబడింది. అందుకే మోడలింగ్ నుంచి యాక్టింగ్ వైపు వెళ్ళాను” అని చెప్పుకొచ్చింది.

Sakshi Movie Teaser : సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘సాక్షి’ టీజర్ రిలీజ్

ఇక మొదటి సినిమాలో అవకాశం రావడానికి 100 కి పైగా ఆడిషన్స్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది. 2016 లో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ రామన్ రాఘవ్ 2.0 చిత్రానికి తనకి మొదటి అవకాశం ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఆ సినిమాలో శోభిత నటనకు గాను కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కి నామినేట్ అయ్యింది. ఆ నామినేషన్ తనని వైవిధ్యమైన సినిమాలు, పాత్రలు చేసేలా స్ఫూర్తిని ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం ఈ భామ హిందీలో ‘సితార’ అనే సినిమాలో నటిస్తుంది. అలాగే హాలీవుడ్ లో ‘మంకీ మాన్’ సినిమాలో నటిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు