షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ఇప్పుడు హీరోగా ఎదిగి వరుస సినిమాలు చేస్తూ వరుస హిట్స్ కొడుతున్నాడు సుహాస్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే ‘ప్రసన్న వదనం’ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా థియేటర్లలో ఉండగానే మరో సినిమాను ప్రకటించారు.’ గొర్రెపురాణం’ అంటూ డిఫరెంట్ జానర్తో వస్తున్నాడు.
బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ టీజర్ను విడుదల చేశారు. ‘ఇప్పుడొక బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాము. ఒక గ్రామంలో రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె.’ అనే వాయిస్ ఓవర్తో టీజర్ ప్రారంభమైంది. గొర్రె మాది.. కాదు మాది.. అంటూ హిందూ, ముస్లిం మతాలకు చెందిన వారు వాదించుకున్నారు. చిన్నగా మొదలైన ఈ వివాదం కాస్త గ్రామ సమస్యగా మారినట్లుగా టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇంకోవైపు సుహాస్ జైలులో ఖైధీగా చూపించారు.
Chiranjeevi : రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
గొర్రెను కారణంగా ఏ సమస్య వచ్చింది. ఆ సమస్య పరిష్కామైందా.? సుహాస్ కు ఆ గొర్రెకు ఏమన్నా సంబంధం ఉందా.? అన్న విషయాలు తెలియాలంటే సినిమా విడుదల అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. కాగా.. మొత్తంగా టీజర్ ఆకట్టుకుంటోంది.