Vishwanath and Sons OTT : ఓటీటీలోకి బ్లాక్ బాస్ట‌ర్ మూవీ.. సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సూర్య న‌టించిన విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ ఓటీటీ (Vishwanath and Sons OTT) స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది.

Suriya Vishwanath and Sons OTT streaming date fix

Vishwanath and Sons OTT : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య న‌టించిన లేటెస్టు మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో మమిత బైజు కథానాయిక‌. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు ఈ మూవీని నిర్మించారు. రాధికా శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర పోషించిన ఈ మూవీ ఆగ‌స్టు 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్లను సాధించింది. 250 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్ల‌ను సాధించింది.

ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా? అని ఎదురుచూస్తున్న వారికి శుభ‌వార్త ఇది. ఈ చిత్ర ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ తెలియ‌జేసింది. సెప్టెంబ‌ర్ 11న స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ బాష‌ల్లో అందుబాటులో ఉంటుంద‌ని చెప్పింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో తెలియ‌జేసింది.

MM Srilekha : జీన్స్‌లో సింగ‌ర్‌.. ఎంఎం శ్రీలేఖ క్యూట్ ఫోటోలు వైర‌ల్..