Talasani Srinivas Yadav : సినిమా వాళ్ళు ఏం అడిగినా చేస్తున్నాం

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..''ఇండస్ట్రీ బాగుండాలి. సినిమా వాళ్ళు ఏం అడిగినా చేస్తున్నాం. అయిదవ షో కూడా ఇచ్చాము. ఇండస్ట్రీలో పని చేసే వారంతా..........

  • Published On : February 23, 2022 / 10:45 PM IST

Talasani

Bheemla Nayak :  పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా నటించారు. ‘భీమ్లా నాయక్’ సినిమాకి త్రివిక్రమ్ మాటలు రాయగా, సాగర్ కే చంద్ర దర్శకత్వలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్లతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 23న బుధవారం సాయంత్రం హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది.

Bheemla Nayak : డప్పు వాయించిన పవన్ కళ్యాణ్ , కేటీఆర్

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..”ఇండస్ట్రీ బాగుండాలి. సినిమా వాళ్ళు ఏం అడిగినా చేస్తున్నాం. అయిదవ షో కూడా ఇచ్చాము. ఇండస్ట్రీలో పని చేసే వారంతా బాగుండాలి. ఫ్యాన్స్ ఇంత సేపు వెయిట్ చేశారు. పవన్ గారి క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. వయసు మాత్రం పెరగట్లేదు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాగా ఆడాలి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో మారుమూల ఉన్న కళాకారులని బయటకి తీసుకొచ్చి వారికి లైఫ్ ఇస్తారు. ఆయన అంత గొప్పవారు.” అని తెలిపారు.