Simbu : తెలుగు రాష్ట్రాల వరదలపై స్పందించిన మొదటి తమిళ్ హీరో.. భారీ విరాళం..

వరద బాధితుల కోసం మన టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి భారీ విరాళాలు ఇచ్చారు.

Tamil Star Silambarasan aka Simbu Gives Huge Donation to Telugu States Flood Effected People

Simbu : ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వర్షాలకు భారీ వరదలు ఏర్పడి విజయవాడ, ఖమ్మం, ఆ చుట్టుపక్కల గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. ఈ వరదల వాళ్ళ ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు. అయితే వరద బాధితుల కోసం మన టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి భారీ విరాళాలు ఇచ్చారు.

ప్రతిసారి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మన హీరోలు, మన తెలుగు స్టార్స్ ప్రజలకు హెల్ప్ చేయడంలో ముందు ఉంటారు. బయటి రాష్ట్రాల్లో జరిగినా మన హీరోలు స్పందిస్తారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో విపత్తులకు బయటి స్టేట్స్ నుంచి ఒక్క హీరో, హీరోయిన్, స్టార్ ఎవ్వరూ కూడా సహాయం చేయరు. వేరే పరిశ్రమల హీరోలు ఇక్కడ కూడా తమ సినిమాలతో సంపాదిస్తున్నా ఇక్కడి వాళ్లకు సహాయం చేయరు అని విమర్శలు వస్తాయి.

Also Read : Devara Record : ‘దేవర’ రిలీజ్‌కి ముందే సరికొత్త రికార్డ్.. అమెరికాలో కలెక్షన్స్ వరద..

అయితే తాజాగా తమిళ హీరో శింబు తెలుగు రాష్ట్రాల వరదలపై స్పందించి వరద బాధితుల కోసం రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి భారీ విరాళం ఇచ్చాడు. తాజాగా తెలుగు కాకుండా బయటి రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు సహాయం చేసిన మొదటి సెలబ్రిటీగా నిలిచాడు శింబు. శింబు రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు మూడు లక్షల చొప్పున మొత్తం ఆరు లక్షలు విరాళంగా ప్రకటించారు. దీంతో శింబు ఫ్యాన్స్, తెలుగు శింబు ఫ్యాన్స్ కూడా అతన్ని అభినందిస్తున్నారు. శింబు మనకు వల్లభ, మన్మధ.. లాంటి పలు సినిమాలతో దగ్గరైన సంగతి తెలిసిందే. ఇటీవల శింబు మానాడు, పాతుతల సినిమాలతో మంచి విజయాలు సాధించాడు.

ట్రెండింగ్ వార్తలు