పెళ్లిచూపులు చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ క్రేజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేస్తున్నాడు. వరుస సక్సెస్లతో జోష్లో ఉన్న విజయ్ నిర్మాతగా మారారు. తనకు పెళ్లిచూపులు వంటి సినిమాను ఇచ్చిన క్రేజీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ను హీరోగా ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నారు. ఇదిలా ఉంటే టెలివిజన్ సంచలనం వాణి బోజన్ను ఈ సినిమాకు హీరోయిన్గా తీసుకున్నారట. ఈ విషయాన్ని వాణి బోజన్ వెల్లడించింది. తమిళనాట మంచి క్రేజ్ ఉన్న వాణి టీవీ సంచలనంగా పేరు తెచ్చుకుంది.
తరుణ్ భాస్కర్ తొలిసారి హీరోగా మారగా విజయ్ దేవరకొండ ఈ సినిమాను తీస్తున్నారని వాణి చెప్పింది.తనకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన విజయ్ దేవరకొండకు ధన్యవాదాలు తెలిపిన వాణి, ఈ సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయం కాబోతున్నట్లు చెప్పింది. ఈ సినిమాకి తమిళనాడులోని చెన్నైకి చెందిన షార్ట్ ఫిల్మ్ మేకర్ సమీర్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపింది. వాణి భోజన్ ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలలో నటిస్తుంది. అందులో ఒకటి వైభవ్తో కాగా ఆ సినిమాకు ఎన్4 అనే టైటిల్ పెట్టారు.