కరోనా క్రైసిస్లో 35 మంది తెలుగు సినిమా పాత్రికేయులకి అండగా నిలిచిన “తెలుగుఫిల్మ్జర్నలిస్ట్స్ అసోసియేషన్”..
కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన క్రైసిస్ అంతా ఇంతా కాదు. ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతుంది. ఎక్కడి వారు అక్కడే వుండిపోవాలి అంటూ లాక్డౌన్ ప్రకటించిన తరువాత అందరూ ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో వుండిపోయారు. ఒక పక్క తెలుగు సినిమా 24 క్రాఫ్ట్లకి ‘కరోనా క్రైసిస్ చారిటీ’ (CCC) ద్వారా పెద్దలు అండగా నిలవటం అందరూ హర్షించాల్సిన విషయం. అయితే 24/7 ఏరోజూ కూడా శెలవు అనే మాట లేకుండా తెలుగు సినిమా కబుర్లును ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో సినిమా అభిమానులకు చేరవేసే సినిమా జర్నలిస్ట్లకి తెలుగు ఫిల్మ్జర్నలిస్ట్ అసోసియేషన్ అండగా వుంటుందని తమ భరోసా తెలియజేసారు.
Read Also : మాటిచ్చాడు నిలబడ్డాడు.. దటీజ్ బాలయ్య.. మామ బాటలోనే అల్లుడు కూడా..
ఈ సందర్భంగ్ ప్రెసిడెంట్ లక్ష్మినారాయణ మాట్లాడుతూ. ‘‘ ఫీల్డ్లో.. అంటే డైలీ ప్రెస్మీట్స్కి హజరయ్యే ప్రతీ ఒక్క జర్నలిస్ట్లకి, వీడియో జర్నలిస్ట్లకి, ఫోటో జర్నలిస్ట్కి ఆసరాగా వుంటాము. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కునే భాగంలో 35 మంది తెలుగు సినిమా పాత్రికేయులకి నెలరోజులకి సరిపడా నిత్యావసరాల సరుకులతో అండగా నిలిచాము. ఇలానే అందరం కలిసి కట్టుగా ఈ సమస్యని ఎదుర్కోవాలని కోరుకుంటున్నాము. ఏ ఒక్కరూ ఆకలితో వుండకూడదనేది మన అసోసియేషన్ ముఖ్య వుద్దేశ్యం.
మీకు (సినీ జర్నలిస్టులకు) ఏ ఇబ్బంది కలిగినా నాకు కాని, నాయిడు సురేంద్ర కుమార్, రాంబాబుకి కానీ ఫోన్ చేసి తెలియజేయవచ్చు.. మీ అందరికి చివరిగా నా ప్రత్యేఖమైన విన్నపం.. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి.. దీన్ని అందరూ అర్థం చేసుకొవాలి, ఏ ఒక్కరికి సమస్య వచ్చినా అందరం అండగా వుండి పోరాడాలి.. అన్ని సమస్యలు పోయి మళ్ళీ అందరం ఆనందంగా మన పనులు చేసుకోవాలని ఆ భగవంతుణ్ణి తెలుగు ఫిల్మ్జర్నలిస్ట్స్ అసోసియేషన్ ద్వారా కోరుకుంటున్నాను. మంచి కార్యక్రమాలకి వెన్నుదన్నుగా వున్న మీ అందరికి నా ప్రత్యేఖ ధన్యవాదాలు’’ అని అన్నారు.