×
Ad

Krishna : తెలుగుతెరపై ఒక సినిమా జనరేషన్ పయనం ముగిసింది..

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక్కపుడు నాలుగు స్తంభాలుగా నిలిచిన నందమూరి తారక్ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, కృష్ణ గారి జనరేషన్ నేటితో ముగిసింది. ఇటీవలే రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు మరణించడం, ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారిని కూడా కోల్పోవడంతో తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది.

  • Published On : November 15, 2022 / 07:49 AM IST

The journey of a film generation on the Telugu screen has ended

Krishna : తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక్కపుడు నాలుగు స్తంభాలుగా నిలిచిన నందమూరి తారక్ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, కృష్ణ గారి జనరేషన్ నేటితో ముగిసింది. ఇటీవలే రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు మరణించడం, ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారిని కూడా కోల్పోవడంతో తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది.

Krishna : సూపర్ స్టార్ కృష్ణ కనుమూత..

మాస్ హీరోలుగా ఈ నలుగురు.. టాలీవుడ్ ని 4 దశాబ్దాలు పాటు మహారాజుల ఏలారు. నిన్న ఉదయం కార్డియాక్ అరెస్ట్ తో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన కృష్ణ, ఈరోజు ఉదయం సుమారు 4 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. కృష్ణ గారి కూడా మరణించడంతో తెలుగుతెరపై ఒక శకం ముగిసింది.

ఇక కృష్ణ గారి మరణ వార్త విన్న అభిమానులు, సినీ ప్రముఖులు అయన మరణానికి చింతిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. కాగా ఒకే ఏడాదిలో అన్నయ్యని, అమ్మని ఇప్పుడు నాన్నని కోల్పోయిన మహేష్ బాబు తీరని శోకాని అనుభవిస్తున్నాడు.