Tollywood Drug Case : రవితేజ విచారణ ఇలా ముగిసింది

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు రవితేజ విచారణ ముగిసింది. సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. విచారణకు సహకరిస్తామని ఈ సందర్భంగా రవితేజ హమీనిచ్చారు.

Actor Ravi Teja : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కార్యాలయంలో అధికారులు పలువురు సెలబ్రెటీలను విచారిస్తున్నారు. అందులో భాగంగా…2021, సెప్టెంబర్ 09వ తేదీ గురువారం ఉదయం ఈడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం సినీ నటుడు రవితేజ చేరుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో రవితేజ కార్యాలయం బయటకు వచ్చి…మీడియాతో ఏమీ మాట్లాకుండా..కారులో వెళ్లిపోయారు.

Read More : Rahul Gandhi : కాలినడక వైష్ణోదేవి ఆలయానికి రాహుల్..ఇందిరా గాంధీ ఫోటో వైరల్

సుమారు ఆరు గంటల పాటు ఆయన్ను విచారించారు. మహ్మద్ జిషాన్ ఆలీఖాన్ అలియాస్ జాక్, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ లను సైతం ఈడీ అధికారులు విచారించారు. 2017 సంవత్సరంలో కొకైన్ సరఫరా చేస్తూ..ఎక్సైజ్ శాఖకు జిషాన్ దొరికాడు. విచారణలో ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు కూపీ లాగినట్లు సమాచారం.

Read More : ISS Module Alert : అంత‌రిక్ష కేంద్రంలో అగ్నిప్రమాదం.. మోగిన స్మోక్ సైరన్లు.. అసలేం జరిగింది?

బ్యాంకు వివరాలు, డ్రైవర్ శ్రీనివాస్ తో జరిపిన ఆర్థిక లావాదేవీలపై రవితేజను ప్రశ్నించారు. ఎప్పడు విచారణకు పిలిచినా…హాజరు కావాలని రవితేజ..డ్రైవర్ శ్రీనివాస్ లకు ఈడీ ఆదేశించారు. విచారణకు సహకరిస్తామని ఈ సందర్భంగా రవితేజ హమీనిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు