నటనపై ఆసక్తి ఎంతో మందికి ఉంటుంది. పొలిటికల్స్ లో రాణిస్తున్న నేతలు సైతం మేకప్ వేసుకుంటుంటారు. ఇప్పటికే ఎంతో మంది నేతలు..యాక్టర్లు అయ్యారు. యాక్టర్లు నేతలయ్యారు. ఈ జాబితాలో విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా చేరిపోయారు.
ఆయన సినిమాలో నటిస్తున్నారు. రాజకీయంగా బిజీగా ఉంటూనే..కళలకు పెద్ద పీఠ వేస్తున్నారు. స్వతహాగా ఈయన స్టేజ్ యాక్టర్. ముఖానికి రంగేసుకున్నారు. పరమ శివుడి వేషంలో అదరగొట్టారు. కార్యకర్తలకు సర్ ఫ్రైజ్ ఇచ్చారు.
రెండు రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కరణం కళా పోషణ చూస్తూ..అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఫుల్ ఖుష్ అయిపోతున్నారు.
జై మాదకొండమ్మ అనే సినిమా రూపొందుతోంది. విశాఖలోని గాజువాకలో శ్రావణమాసం సందర్భంగా షూటింగ్ ప్రారంభించారు. ఎమ్మెల్యే ధర్మశ్రీపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. పరమ శివుడికి తపోభంగం చేయడానికి వచ్చిన మాంత్రికుని మధ్య జరిగే సన్నివేశాలను షూట్ చేశారు.
ధర్మశ్రీకి నటన అంటే ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 2004 మాడగుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఓ కార్యక్రమంలో ఆయన అన్నమయ్య పాత్ర వేశారంట. ప్రస్తుతం తన నటనతో ఆకట్టుకుంటున్నారు.