Tamil Nadu Girl: పసిబిడ్డపై పైశాచికం.. బిస్కెట్ ఆశ చూపి బలాత్కారం.. తమిళనాడులో మూడేళ్ల చిన్నారిపై దారుణం
తమిళనాడు(Tamil Nadu Girl)లోని తిరువళ్లూర్లో మూడేళ్ల చిన్నారిపై జరిగిన అమానవీయ లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
- V Santhosh Kumar
- Published on- June 15, 2026 / 02:00 PM IST
3 year old child dies after being sexually assaulted by guest workers near Chennai
- మూడేళ్ల చిన్నారిపై దారుణం
- నిందితుడిపై పోక్సో, హత్య కేసులు
- రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు
Tamil Nadu Girl: తమిళనాడులోని తిరువళ్లూర్లో మూడేళ్ల చిన్నారిపై జరిగిన అమానవీయ లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బిస్కెట్లు ఇస్తానని నమ్మించి సదరు బాలికను పొదల చాటుకు తీసుకెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. తీవ్ర గాయాలతో లభ్యమైన ఆ చిన్నారి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితుడితో పాటు అనుమానితులపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, పోక్సో చట్టంతో పాటు హత్య కేసును కూడా నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
FSSAI: ‘హెల్తీ’ పేరుతో మోసం? FSSAI కఠిన చర్యలతో ఫుడ్ కంపెనీలకు షాక్.. 8 కంపెనీలకు నోటీసులు
ఈ దారుణ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా (Tamil Nadu Girl)రాజకీయంగా, సామాజికంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గతంలో ఇలాంటి ఘోరాలు ఎక్కడో జరుగుతాయని వినేవాళ్లమని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని, నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చూడాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల తిరుచ్చిలో కూడా 14 ఏళ్ల బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన మరో ఘటన వెలుగుచూడటంతో ప్రజల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. వరుసగా జరుగుతున్న ఈ అఘాయిత్యాలు రాష్ట్రంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో నిందితులపై కఠిన చట్టాలను ప్రయోగించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది.
