Paramilitary Forces: పారామిలిటరీలో 680మంది ఆత్మహత్య
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్(CAPF) మరియు అస్సాం రైఫిల్స్(AR) అందించిన డేటా ప్రకారం, పారామిలిటరీ దళాలకు చెందిన 680 మంది సిబ్బంది గత ఆరేళ్లలో ఆత్మహత్య చేసుకున్న
- vamsi
- Published On : August 5, 2021 / 07:03 AM IST
Paramilitery
Paramilitary Forces: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్(CAPF) మరియు అస్సాం రైఫిల్స్(AR) అందించిన డేటా ప్రకారం, పారామిలిటరీ దళాలకు చెందిన 680 మంది సిబ్బంది గత ఆరేళ్లలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ వెల్లడించారు.
రాజ్యసభలో భాజపా ఎంపీ సుశీల్ కుమార్ మోదీ లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఇదే సమయంలో ప్రమాదాలు మరియు కారణంగా మరణించిన సిబ్బంది సంఖ్య 1,764గా ఉంది. ఎన్కౌంటర్లలో చనిపోయినవారి సంఖ్య 323గా ఉంది.
భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ సుశీల్ కుమార్ మోదీ “గత ఆరేళ్లలో 700 మందికి పైగా పారా మిలటరీ బలగాలు ఆత్మహత్య చేసుకున్న విషయం వాస్తవమేనా” అని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖను అడిగారు.
ఆ ప్రశ్నకు సమాధానంగా.. దేశీయ సమస్యలు, అనారోగ్యం మరియు ఆర్థిక సమస్యలు ఆత్మహత్యల వెనుక ఇతర కారణాలు ఉండవచ్చని రాయ్ రాజ్యసభకు వ్రాతపూర్వక సమాధానంలో చెప్పారు. ఈ సమస్యను ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రొఫెషనల్ ఏజెన్సీలతో సంప్రదింపులు జరిపి అధిగించేందుకు ప్రయత్నాలు చేస్తుందని రాజ్యసభకు వివరించారు.
“బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (BPR & D) 2004లో ఒత్తిడిని కలిగించే అంశాలపై ఒక అధ్యయనాన్ని నిర్వహించగా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) అహ్మదాబాద్ 2012లో BSF మరియు CRPF కోసం ఇదే అధ్యయనం చేసింది” అని ఆయన చెప్పారు.
